Webdunia - Bharat's app for daily news and videos

Install App

నవ నిర్మాణ సేన జెండా మార్పు

Webdunia
శుక్రవారం, 24 జనవరి 2020 (08:49 IST)
మహారాష్ట్ర నవ నిర్మాణ సేన (ఎంఎన్‌ఎస్‌) జెండా మారింది. పూర్తిగా కాషాయ రంగు నేపథ్యంలో నలుపు రంగు అష్టభుజిపై పసుపు రంగు అక్షరాలతో ఉన్న రాజముద్రతో ఈ జెండా కనిపిస్తోంది.

ఛత్రపతి శివాజీ పరిపాలన సమయంలో   రాజముద్రను వాడేవారు. అంతకు ముందు ఎంఎన్‌ఎస్‌ జెండాలో కాషాయం, నీలం, ఆకుపచ్చ రంగులు ఉండేవి. ఎంఎన్‌ఎస్‌ చీఫ్‌ రాజ్‌ థాకరే గురువారం తన పార్టీ నూతన జెండాను ఆవిష్కరించారు.

వీర్‌ సావర్కర్‌, డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌, ప్రబోధాంకర్‌ థాకరే, ఛత్రపతి శివాజీల చిత్ర పటాలకు రాజ్‌ థాకరే పూల మాలలు వేసి, నివాళులర్పించారు. అనంతరం మెగా ర్యాలీని ప్రారంభించారు. శివసేన వ్యవస్థాపకుడు బాల్‌ థాకరే జయంతిని ఆ పార్టీ కార్యకర్తలు గురువారం జరుపుకున్నారు.

రాజ్‌ థాకరేకు బాల్‌ థాకరే సమీప బంధువు అన్న సంగతి విదితమే.రాజ్‌ థాకరేతో ఇటీవల బీజేపీ సీనియర్‌ నేత, మాజీ ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్‌ భేటీ అయ్యారు. దీంతో ఇరు పార్టీలు పొత్తు పెట్టుకునే అవకాశం ఉందని చాలా మంది భావించారు.

సంబంధిత వార్తలు

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

తర్వాతి కథనం
Show comments