చెన్నై లోకల్ రైలులో చైన్ స్నాచర్లు ప్రయాణీకులను ఆందోళనకు గురి చేస్తోంది. చెన్నై అరక్కోణం లోకల్ రైలులో ఈ ఘటన చోటుచేసుకుంది. రైలులో సీటుపై నిద్రిస్తున్న మహిళా ప్రయాణికురాలి మెడలోని మంగళసూత్రాన్ని లాక్కుని కదులుతున్న రైలు నుంచి పారిపోయేందుకు ప్రయత్నించిన దుండగుడిని రైల్వే పోలీసులు అరెస్ట్ చేశారు.
ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దొంగను పట్టుకునేందుకు తోటి ప్రయాణీకులు సైతం వెంటనే స్పందించారు. ఆపై పోలీసులకు సమాచారం అందించడంతో రైల్వే పోలీసులు అతనిని అదుపులోకి తీసుకుని విచారణ జరుపుతున్నారు.