Webdunia - Bharat's app for daily news and videos

Install App

థర్డ్ వేవ్ హెచ్చరికలు ఓవైపు... జికా వైరస్ మరోవైపు.. మహారాష్ట్రలో..?

Webdunia
సోమవారం, 2 ఆగస్టు 2021 (22:26 IST)
ఒకవైపు కరోనా మహమ్మారి రూపాంతరాలు చెందుతూ ప్రజలను ఇంకా భయపెడుతూనే ఉంది. మన దేశంలో ఇంకా సెకండ్ వేవ్ ముగియక ముందే థర్డ్ వేవ్ హెచ్చరికలు వస్తూనే ఉన్నాయి. ఇక ఇది చాలదని జికా వైరస్ కూడా ప్రబలుతోంది. ఇప్పటికే కేరళతో పాటు మరికొన్ని రాష్ట్రాలలో వెలుగుచూసిన జికా వైరస్ తాజాగా మహారాష్ట్రలో కూడా వెలుగు చూసింది.
 
వివరాల్లోకి వెళితే.. మహారాష్ట్రలో పూణె జిల్లాలోని పురందర్ తహసీల్ పరిధిలో 50ఏళ్ల మహిళకు లక్షణాలు కనిపించడంతో పరీక్షలు జరిపారు. నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ (NIV)జులై 30న ఆమెకు పరీక్షలు జరిపి జికా వైరస్‌గా ఖరారు చేశారు. దీనిపై ఇప్పుడు కేంద్రం ప్రత్యేక దృష్టి సారించింది. తాజాగా కొంత మంది వైద్య నిపుణుల బృందాన్ని మహారాష్ట్రకు పంపించింది.
 
ఈ బృందంలో హార్డింగ్ మెడికల్ కాలేజీ గైనకాలజిస్ట్, నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మలేరియా రీసెర్చ్ నుంచి ఓ ఎంటమాలిజిస్ట్ సభ్యులుగా ఉండగా మొత్తం ముగ్గురు ఈ బృందంలో ఉన్నారు. మహారాష్ట్రలో ఆరోగ్య పరిస్థితులపై అధ్యయనం చేసి ఈ బృందం కేంద్ర ఆరోగ్య శాఖకు సిఫార్సు చేయనుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Allu Arjun: అల్లు అర్జున్ ఐకాన్ స్టార్ మాత్రమే కాదు, ప్రకటనల రంగంలోనూ పవర్ హౌస్

Pawan kalyan: అగ్ని ప్రమాదంలో పవన్ కల్యాణ్ కొడుకు మార్క్ శంకర్ - సింగపూర్ వెళ్ళనున్న పవన్

కీర్తి సురేష్‌కు 2025 బాగా కలిసొస్తుందా? ఆ ఫోటోలు వైరల్

నాగార్జున బోర్ కొట్టేశారా? బాలయ్య కోసం బిగ్ బాస్ నిర్వాహకులు పడిగాపులు?

దండోరాలో శివాజీ.. 25రోజుల పాటు కంటిన్యూగా షూటింగ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మొబైల్ చూస్తూ మలవిసర్జన చేస్తున్నారా? అయితే అంతే..!!

ఈ చిన్న చిట్కాలు పాటిస్తే వేసవికాలంలో అధిక చెమటను నివారించవచ్చు!

హైదరాబాద్‌లోని బంజారా హిల్స్‌లో ది బేర్ హౌస్ స్టోర్ ప్రారంభం

చికెన్, మటన్ కంటే ఇందులో ప్రోటీన్లు ఎక్కువ? శాకాహారులకు బెస్ట్ ఫుడ్ ఇదే

మొలకెత్తిన బంగాళదుంపలు తింటే?

తర్వాతి కథనం
Show comments