దీపావళి బోనస్_ఉద్యోగులకు కేంద్రం గుడ్ న్యూస్

Webdunia
బుధవారం, 20 అక్టోబరు 2021 (13:28 IST)
ఉద్యోగులకు కేంద్రం గుడ్ న్యూస్ చెప్పింది. తాజాగా కేంద్రం దీపావళి బోనస్ ప్రకటించింది. కానీ ఇది అందరికీ కాదు. ఇది పారా మిలిటరీ ఉద్యోగులకు మాత్రమే అని కేంద్రం స్పష్టంగా తెలిపింది. వివరాల్లోకి వెళితే.. పారా మిలిటరీ ఉద్యోగులకు దీపావళి బోనస్‌ని కేంద్రం ఇవ్వనుంది. 
 
అయితే వీరికి 30 రోజుల దీపావళి బోనస్ అందిస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం అంది. ఇక ఇది ఎవరికి వర్తిస్తుంది అనేది చూస్తే.. ప్రొడక్టివిటీ లింక్డ్ బోనస్ లభించని గ్రూప్-సీ, గ్రూప్-బీ నాన్ గెజిటెడ్ ఎంప్లాయీస్ అందరికీ కూడా ఇది వర్తిస్తుంది.
 
ఇదిలా ఉంటే 2021 మార్చి 31 నాటికి సర్వీసులో ఉన్న వారికి మాత్రమే బోనస్ వస్తుంది. అలానే 2020-21లో ఆరు నెలలు సర్వీస్‌లో ఉన్నా కూడా ఈ బోనస్ డబ్బులని పొందొచ్చు. ఇది ఇలా ఉంటే కేంద్రం ప్రభుత్వం ఇటీవలనే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు పలు రకాల బెనిఫిట్స్ ని ఇవ్వడం జరిగింది.
 
డియర్‌నెస్ అలవెన్స్ పెరుగుదల, డీఆర్ పెంపు ఇవ్వడం మనం చూసాం. అయితే రానున్న రోజుల్లో మళ్లీ డీఏ పెంపు కూడా వుండే అవకాశం వుంది. మరోసారి డీఏ మళ్లీ 3 శాతం పెరగొచ్చని నివేదికలు పేర్కొంటున్నాయి. అలాగే త్వరలోనే పీఎఫ్ వడ్డీ డబ్బులు కూడా ఉద్యోగుల ఈపీఎఫ్ ఖాతాలో పడతాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sudheer: సుడిగాలి సుధీర్, దివ్యభారతి జంటగా G.O.A.T షూటింగ్ పూర్తి

ఆకాష్ జగన్నాథ్ ఆవిష్కరించిన వసుదేవసుతం టైటిల్ సాంగ్

Roshan: రోషన్ హీరోగా పీరియాడిక్ స్పోర్ట్స్ డ్రామాగా ఛాంపియన్

Janhvi Kapoor: రూటెడ్ మాస్ పాత్రలో అచ్చియమ్మ గా జాన్వీ కపూర్

The Girlfriend: ది గర్ల్ ఫ్రెండ్ ప్రతి ఒక్కరికీ కనెక్ట్ అవుతుంది - ధీరజ్ మొగిలినేని, విద్య కొప్పినీడి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఔషధంలా ఉపయోగపడే లవంగాలు, ఏమేమి ప్రయోజనాలు?

అదేపనిగా సెల్ ఫోన్లు, ల్యాప్‌టాప్‌ల ముందు కూర్చుంటున్నారా?

రోగనిరోధక శక్తిని పెంచే హెర్బల్ టీలు

నాట్స్ విస్తరణలో మరో ముందడుగు, షార్లెట్ చాప్టర్ ప్రారంభించిన నాట్స్

కార్తీక మాసంలో నేతి బీరకాయ పచ్చడి ఎందుకు తింటారు? ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments