Webdunia - Bharat's app for daily news and videos

Install App

మోర్టార్లతో భారత సైనిక స్థావరాలపై దాడి... పాక్ మరోమారు కాల్పుల ఉల్లంఘన

పాకిస్థాన్ శత్రు మూకలు మరోమారు రెచ్చిపోయాయి. అంతర్జాతీయ నియంత్రణ రేఖ వద్ద మరోమారు కాల్పులు ఉల్లంఘనకు పాల్పడింది. ఓవైపు భారత్ కాల్పుల ఉల్లంఘనకు పాల్పడుతోందని ఆరోపిస్తూనే మరోవైపు భారత సైనిక స్థావరాలపై ప

Webdunia
మంగళవారం, 18 అక్టోబరు 2016 (09:48 IST)
పాకిస్థాన్ శత్రు మూకలు మరోమారు రెచ్చిపోయాయి. అంతర్జాతీయ నియంత్రణ రేఖ వద్ద మరోమారు కాల్పులు ఉల్లంఘనకు పాల్పడింది. ఓవైపు భారత్ కాల్పుల ఉల్లంఘనకు పాల్పడుతోందని ఆరోపిస్తూనే మరోవైపు భారత సైనిక స్థావరాలపై పాక్ కాల్పులకు తెగబడింది. 
 
రాజౌరి జిల్లాలోని నౌషేరా సెక్టార్‌లో నియంత్రణ రేఖ వెంబడి ఉన్న భారత సైనిక స్థావరాలపై పాక్ ఆర్మీ సోమవారం రాత్రి కాల్పులు జరిపింది. రాత్రి 8:30 గంటలకు ప్రారంభమైన కాల్పులు అర్ధరాత్రి దాటాక(బుధవారం ) 1:30 గంటల వరకు కొనసాగినట్టు రక్షణ వర్గాలు తెలిపాయి. 
 
ఇందుకోసం 82 ఎంఎం మోర్టార్లు, ఆటోమెటిక్స్ ఉపయోగించి పాక్ దళాలు కాల్పులు జరిపినట్టు అధికారులు వెల్లడించారు. ఈ ఘటనలో ఎటువంటి ప్రాణ నష్టం జరగలేదు. కాగా ఆదివారం పాక్ దళాల కాల్పుల్లో భారత‌ జవాను ఒకరు మరణించిన సంగతి తెలిసిందే. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రాజు గాని సవాల్ రిలీజ్ కోసం ఎదురుచూస్తున్నాం : డింపుల్ హయతి, రాశీ సింగ్

AM Ratnam: హరి హర అంటే విష్ణువు, శివుడు కలయిక - ఇది కల్పితం, జీవితకథ కాదు : నిర్మాత ఎ.ఎం. రత్నం

పెద్ద నిర్మాతను ఏడిపించిన సీనియర్ జర్నలిస్టు - ఛాంబర్ చర్య తీసుకుంటుందా?

టాలీవుడ్‌లో విషాదం - నటుడు ఫిష్ వెంకట్ ఇకలేరు..

60 యేళ్ల వయసులో 30 యేళ్ల నటిని పెళ్ళాడిన తమిళ దర్శకుడు మృతి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వాన చినుకులతో వచ్చేసాయ్ మొక్కజొన్న పొత్తులు, ఇవి తింటే?

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

Soap: కుటుంబ సభ్యులంతా ఒకే సబ్బును ఉపయోగిస్తున్నారా?

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

వర్షాకాలంలో ఆయుర్వేద ఆహారం: మెరిసే చర్మాన్ని పొందడానికి నిపుణుల చిట్కాలు

తర్వాతి కథనం
Show comments