Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏకకాలంలో 110 ప్రాంతాల్లో సీబీఐ సోదాలు

Webdunia
మంగళవారం, 9 జులై 2019 (18:24 IST)
అవినీతిపరుల గుండెల్లో రైళ్లు పరుగెత్తించింది సీబీఐ. మంగళవారం ఏకకాలంలో 110 ప్రాంతాల్లో తనిఖీలు చేపట్టి హడలెత్తించింది. 30 కేసులకు సంబంధించి 19 రాష్ట్రాల్లో.. 110 ప్రాంతాల్లో సీబీఐ బృందాలు సోదాలు నిర్వహించాయి. ప్రధానంగా అవినీతి, ఆయుధాల స్మగ్లింగ్ ఆరోపణలపై విసృతంగా గాలించాయి. 

సీబీఐ దాడులతో నేర ప్రవృత్తి కలిగిన వ్యాపారులు బెంబేలెత్తిపోయారు. పక్కా ప్రణాళికతో ఏకకాలంలో 110 చోట్ల దాడులు చేయడంతో బిత్తరపోయారు. ఢిల్లీ, ముంబై, లుథియానా, థానే, వాల్‌సాడ్, పుణె, పలానీ, గయా, గుర్గావ్, చండీగఢ్, భోపాల్, సూరత్, కోలార్ ఇతర చోట్ల దాడులు నిర్వహిస్తున్నట్టు సీబీఐ ఉన్నతాధికారులు మీడియాకు వివరించారు. 
 
మొత్తం 16 కేసుల్లో మోసపూరిత సొమ్ము రూ.1100 కోట్లు ఉంటుందని అధికారులు పేర్కొన్నారు. ఈ కేసుల్లో వివిధ కంపెనీలు, సంస్థలు, ప్రమోటర్లు, డైరెక్టర్లు, బ్యాంకు అధికారులు, ఇతరులు ఉన్నారని పేర్కొన్నారు. బ్యాంకులకు రూ.13 వేలకు కుచ్చుటోపీ పెట్టి విదేశాల్లో నక్కిన నీరవ్ మోడీ, మొహుల్ చోక్సీ ఉదంతం.. కేంద్రాన్ని ఉక్కిరి బిక్కిరి చేస్తోంది. దీంతో మిగతా ఆర్థిక నేరగాళ్లపై ఉక్కుపాదం మోపాలని దాడులు చేయిస్తున్నట్టు విశ్వసనీయం సమాచారం.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'కన్నప్ప' రిలీజ్‌కు ముందు మంచు విష్ణుకు షాకిచ్చిన జీఎస్టీ అధికారులు

డబ్బుల కోసం సినిమాలు చేయాలని లేదు, కన్నప్ప లో ప్రభాస్, విష్ణు పాత్రలు హైలైట్ : శివ బాలాజీ

ఎంటర్టైన్మెంట్, లవ్ స్టోరీ వర్జిన్ బాయ్స్ కి సెన్సార్ నుండి ఏ సర్టిఫికెట్

శ్రీశైలం దర్శనంతో ఆధ్యాత్మిక ప్రయాణాన్ని ముగించిన మంచు విష్ణు

Kannappa first review : మంచు విష్ణు చిత్రం కన్నప్ప ఫస్ట్ రివ్యూ చెప్పేసిన నటుడు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గోరింటతో ఆరోగ్యం, అందం

వ్రిటిలైఫ్ ఆయుర్వేద చర్మ సంరక్షణ శ్రేణికి ప్రచారకర్తలుగా స్మృతి మంధాన, మణికా బాత్రా

దివ్యాంగ విద్యార్ధుల కోసం నాట్స్ ఉచిత బస్సు, విశాఖలో బస్సును లాంఛనంగా ప్రారంభించిన ఎంపీ భరత్

సయాటికా నొప్పి నివారణ చర్యలు ఏమిటి?

నేరేడు పండ్లు తింటే 8 ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments