Webdunia - Bharat's app for daily news and videos

Install App

తమిళనాడు బస్సు అనుకుని.. తెలంగాణ బస్సుకు నిప్పు ... ఆంధ్రా వ్యక్తి సజీవదహనం

కర్నాటక రాష్ట్రంలో దారుణం జరిగింది. షిర్డీ - హైదరాబాద్ ప్రాంతాల మధ్య నడిచే బస్సుకు కొందరు ఆందోళనకారులు నిప్పుపెట్టారు. దీంతో బస్సులో ప్రయాణిస్తున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన ఓ వ్యక్తి సజీవ దహనమ

Webdunia
శుక్రవారం, 16 సెప్టెంబరు 2016 (09:29 IST)
కర్నాటక రాష్ట్రంలో దారుణం జరిగింది. షిర్డీ - హైదరాబాద్ ప్రాంతాల మధ్య నడిచే బస్సుకు కొందరు ఆందోళనకారులు నిప్పుపెట్టారు. దీంతో బస్సులో ప్రయాణిస్తున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన ఓ వ్యక్తి సజీవ దహనమయ్యాడు. అలాగే ఆ బస్సులో మరికొంతమంది మృతులున్నట్లు సమాచారం. 
 
కావేరీ నదీ జలాల విషయంపై కర్ణాటక రాష్ట్రంలో గత నాలుగు రోజులుగా పెద్దఎత్తున ఆందోళనలు జరుగుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఆ ఆందోళనలు విధ్వంసాలకు దారితీయగా... శుక్రవారం షిర్డీ- హైదరాబాద్‌ బస్సుకు ఆందోళనకారులు నిప్పుపెట్టారు. తెలంగాణ రాష్ట్రానికి చెందిన బస్సు టీఎస్ రిజిస్ట్రేషన్‌తో ఉండగా తమిళనాడు(టీఎన్) రాష్ట్రానికి చెందిన బస్సు అనుకుని ఆందోళనకారులు నిప్పుపెట్టారు. 
 
దీంతో బస్సులో ప్రయాణిస్తున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, పశ్చిమగోదావరి జిల్లా తుని పట్టణానికి చెందిన విహాన్ అనే యువకుడు సజీవ దహనమయ్యాడు. అలాగే బస్సులో ప్రయాణిస్తున్న మరికొంత మంది కూడా సజీవ దహనమైనట్లు తెలుస్తోంది. కాగా... ఆ బస్సులో ప్రయాణిస్తున్న వారిలో ఎక్కువగా తెలుగు వారే ఉన్నట్లు సమాచారం.
 
మరోవైపు.. కర్నాటక వ్యాప్తంగా భారీ సంఖ్యలో బలగాలను మొహరించివున్న విషయం తెల్సిందే. పలు ప్రాంతాల్లో భద్రతను కట్టుదిట్టం చేశారు. అదేవిధంగా తమిళనాడు రాష్ట్రంలో బంద్ ప్రశాంతంగా సాగుతోంది. దీంతో జనజీవనం అస్తవ్యస్తమైంది. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sreeleela: భగవంత్ కేసరి గర్జించేలా చేసిన ప్రతి కూతురికి, అందరికీ థ్యాంక్స్.. శ్రీలీల

Bhagavanth Kesari: జాతీయ చలనచిత్ర పురస్కార విజేతలకు అభినందనలు-పవన్ కళ్యాణ్

మదరాసి నుంచి శివకార్తికేయన్ లవ్ ఫెయిల్యూర్ యాంథమ్

మిత్ర మండలి నుంచి రెండవ గీతం స్వేచ్ఛ స్టాండు విడుదల

భగవత్ కేసరి , 12th ఫెయిల్ ఉత్తమ చిత్రం; షారుఖ్ ఖాన్, విక్రాంత్ మాస్సే ఉత్తమ నటుడి అవార్డు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గుత్తి వంకాయ కూర ఆరోగ్య ప్రయోజనాలు

అనారోగ్య సమస్యలతో బాధపడుతూ కొబ్బరి నీళ్లు తాగుతున్నారా?

Goat Milk: మహిళలకు మేకపాలు ఎలా మేలు చేస్తుందో తెలుసా?

విడాకులు తీసుకున్న మహిళను పెళ్లాడితే ఎలా వుంటుంది?

కుషాల్స్ ఫ్యాషన్ జ్యువెలరీ, నటి ఆషికా రంగనాథ్‌తో వరమహాలక్ష్మిని జరుపుకోండి

తర్వాతి కథనం
Show comments