Webdunia - Bharat's app for daily news and videos

Install App

గ్యాస్ కట్టర్‌తో ఏటీఎంను బద్దలు కొట్టిన దండగులు...

Webdunia
ఆదివారం, 17 డిశెంబరు 2023 (14:51 IST)
గ్యాస్ కట్టర్‌తో ఏటీఎం యంత్రాన్ని పగులగొట్టిన దండుగలు...  లక్షలాది రూపాయలతో పారిపోయారు. ఈ ఘటన ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని రూక్కీ జిల్లాలోని ధండేరా ప్రాంతంలో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు అక్కడి సీసీటీవీ కెమెరాలో రికార్డు కాగా, తాజాగా వెలుగులోకి వచ్చింది. 
 
సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో ప్రకారం.. మొత్తం నలుగురు దొంగలు ఈ చోరీలో పాలుపంచుకున్నారు. తమను ఎవరూ గుర్తుపట్టకుండా ఒంటికి దుప్పట్లు చుట్టుకున్న ముగ్గురు దుండగులు ఏటీఎం నుంచి నగదు ఉన్న సంచులతో బయటకు రావడం స్పష్టంగా కనిపిస్తోంది. బయట ఉన్న పార్క్ చేసిన తెల్లని స్కార్పియో వాహనంలోని డిక్కీలో ఆ డబ్బు సంచులు పడేసి అందరూ కారెక్కి పరారయ్యారు.
 
ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఏటీఎంకు చేరుకుని పరిశీలించారు. దొంగల కోసం ఆ ప్రాంతంలో గాలించారు. నిందితులు గ్యాస్ కట్టర్‌తో ఏటీఎంను కట్ చేయడం వల్ల లోపల ఉన్న నగదు కొంత కాలిపోయినట్టు పోలీసులు తెలిపారు. కాలిపోయిన డబ్బులు వదిలి మిగతా సొత్తుతో వారు పరారైనట్టు పేర్కొన్నారు. నిందితుల కోసం గాలిస్తున్నట్టు పేర్కొన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బిగ్ బాస్ సీజన్ 19: పహల్గామ్ దాడి బాధితురాలు హిమాన్షి నర్వాల్.. ఈ షోలో ఎంట్రీ ఇస్తారా?

పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్‌గా విజయ్ ఆంటోనీ భద్రకాళి డేట్ ఫిక్స్

మోతేవారి లవ్ స్టోరీ’ అద్వితీయ విజయం,3 రోజుల్లో ఆకర్షించిన బ్లాక్ బస్టర్ సిరీస్

దక్షిణాది సినిమాల్లో నటనకు, బాలీవుడ్ లో గ్లామరస్ కు పెద్దపీఠ : పూజా హెగ్డే

మెక్‌డోవెల్స్ సోడా బ్రాండ్ అంబాసిడర్ గా విజయ్ దేవరకొండ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పెరుగుతో వీటిని కలిపి తినకూడదు, ఎందుకంటే?

సత్తెనపల్లి మొల్లమాంబ వృద్ధాశ్రమంలో నాట్స్ అన్నదానం

టమేటోలు తింటే కలిగే ఆరోగ్యప్రయోజనాలు ఏమిటి?

Chapati Wheat Flour: ఫ్రిజ్‌లో చపాతీ పిండిని నిల్వ చేస్తే ఆరోగ్యానికి మేలు జరుగుతుందా?

మహిళలు వంకాయను తీసుకుంటే.. ఏంటి లాభం?

తర్వాతి కథనం
Show comments