Webdunia - Bharat's app for daily news and videos

Install App

నాటు బాంబులతో దాడిచేసి.. కత్తులతో నరికి.. బీజేపీ నేత దారుణ హత్య

Webdunia
సోమవారం, 27 మార్చి 2023 (15:32 IST)
పుదుచ్చేరిలో భారతీయ జనతా పార్టీకి చెందిన ఓ నేత ఒకరు దారుణ హత్యకు గురయ్యారు. మంగళం నియోజకవర్గం కార్యదర్శిగా ఉన్న సెంథిల్ కుమార్ (46).. ఆదివారం రాత్రి ఓ బేకరీ వద్ద నిల్చొనివున్న సమయంలో కొందరు వ్యక్తులు బైకులపై వచ్చి తొలుత నాటు బాంబులతో దాడి చేశారు. ఆ తర్వాత కత్తులతో నరికి చంపి అక్కడ నుంచి పారిపోయారు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. 
 
దుండగులు బైకులపై రావడం, నాటు బాంబులతో దాడి చేయడం, మారణాయుధాలతో సెంథిల్ కుమార్‌ను విచక్షణా రహితంగా నరకడం, ఆ తర్వాత అక్కడ నుంచి పారిపోవడం వంటి దృశ్యాలు సీసీటీవీ కెమెరాల్లో నమోదయ్యాయి. 
 
కాగా, సెంథిల్ కుమార్ గత కొంతకాలంగా గంజాయి విక్రయాలకు వ్యతిరేకంగా పోరాటం చేస్తున్నారు. దీంతో గంజాయి మాఫియా ముఠానే ఈ దారుణానికి పాల్పడివుంటుందని పోలీసులు అనుమానిస్తున్నారు. అదేసమయంలో బీజేపీ - ఎన్ఆర్ కాంగ్రెస్ సంకీర్ణ ప్రభుత్వం ఈ హత్య కేసును సీరియస్‌గా తీసుకుంది. స్థానిక సీఐతో పాటు ఎస్.ఐను కూడా సస్పెండ్ చేసింది. 
 
హంతకులను గుర్తించి, అరెస్టు చేసేందుకు నాలుగు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసింది. ఈ కేసును వివిధ కోణాల్లో విచారణ జరుపుతున్నారు. పాత కక్షల కారణంగా హత్య చేశారా? లేక మరేదైనా కారణం వల్ల చంపేశారా? అనే అంశాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు. సెంథిల్ కుమార్ నివసించే ప్రాంతంలో భారీ సంఖ్యలో పోలీసులను మొహరించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మీరు విలన్‌గా చేస్తే మొదటి సీన్‌లోనే మమ్మల్ని కాల్చి చంపేస్తా?

Allu Arjun: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ముందే పుష్ప-2 డైలాగ్ చెప్పిన అల్జు అర్జున్ (video)

Anirudh Ravichander: కావ్య మారన్‌ను వివాహం చేసుకోబోతున్న అనిరుధ్?

Manchu Lakshmi: నేను లండన్ వెళ్లలేదు.. ముంబై వెళ్ళాను.. మంచు లక్ష్మి (video)

Prabhas: ప్రభాస్, మారుతీ, థమన్ నవ్వులోంచి రాజా సాబ్ టీజర్ రాబోతుంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?

జామ ఆకుల టీ తాగితే?

ఇది షాకింగ్ వార్తే.. ఆల్కహాల్‌ కాలేయ వ్యాధులు.. మృతుల్లో మహిళలే ఎక్కువ

టీలో కల్తీని ఎలా కనుగొనాలి? ప్రతి వినియోగదారుడు తప్పనిసరిగా తెలుసుకోవలసినది

కొలెస్ట్రాల్ వెన్నలా కరిగిపోవాలంటే ఇది తాగాల్సిందే

తర్వాతి కథనం
Show comments