Webdunia - Bharat's app for daily news and videos

Install App

కొండ చిలువ జింకను మింగేసింది.. పొట్టకు సరిపోక.. మృత్యువాత పడింది..

అత్యాశ చేటేనని ఈ ఘటన నిరూపించింది. ఓ కొండ చిలువ జింకనే మింగేయాలనుకుంది. కానీ జింక ఆకారం.. ఆ కొండ చిలువ పొట్టకు సరిపోక.. ప్రాణాలు విడిచింది. గుజరాత్‌లోని గిర్ వన్యప్రాణి అభయారణ్యం సమీపంలో ఈ ఘటన చోటుచేస

Webdunia
గురువారం, 22 సెప్టెంబరు 2016 (10:33 IST)
అత్యాశ చేటేనని ఈ ఘటన నిరూపించింది. ఓ కొండ చిలువ జింకనే మింగేయాలనుకుంది. కానీ జింక ఆకారం.. ఆ కొండ చిలువ పొట్టకు సరిపోక.. ప్రాణాలు విడిచింది. గుజరాత్‌లోని గిర్ వన్యప్రాణి అభయారణ్యం సమీపంలో ఈ ఘటన చోటుచేసుకుంది. 
 
గిర్ వన్యప్రాణి అభయారణ్యం సమీపంలో 20 అడుగుల పొడవైన కొండచిలువ పెద్ద కృష్ణ జింకను మింగింది. ఆ తర్వాత కదలలేక రోడ్డుపై పక్కన పడి నానా అవస్థలు పడింది. దాన్ని గమనించిన స్థానికులు అటవీశాఖకు సమాచారం అందించారు. సిబ్బంది వచ్చి దాన్ని తీసుకెళ్ళి ఓ ఎన్‌క్లోజర్‌లో ఉంచారు.
 
అయితే స్థాయికి మించిన ప్రాణిని అది మింగడంతో జీర్ణించుకోలేక మృత్యువాత పడింది. సాధారణంగా కొండచిలువలు ఏదైనా జంతువును మింగితే అది జీర్ణం కావడానికి కొన్ని వారాలు, ఒక్కోసారి నెలకుపైగా పట్టవచ్చు. అప్పటి వరకు అవి ఆహారం తీసుకోవు. అలాంటిది జింకను మింగితే కొండచిలువ పరిస్థితి ఏంటో అర్థం చేసుకోవచ్చు. జింకను మింగేసిన కొండచిలువ నానా తంటాలు పడి చివరకుడ ప్రాణాలు విడిచింది. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సినిమా రిజల్ట్ తర్వాత సమీక్షించుకుని తర్వాత డిసైడ్ చేసుకుంటా : డైరెక్టర్ ఫణీంద్ర నర్సెట్టి

విజయ్ సేతుపతి, సంయుక్త జంటగా పూరి జగన్నాథ్ చిత్రం

తమ్ముడు నుంచి ఫస్ట్ లిరికల్ సాంగ్ భూ అంటూ భూతం.. రిలీజ్

టైటిల్ & ఫస్ట్ లుక్ త్వరలో విడుదల కానున్న రవితేజ 76వ చిత్రం

సుహాస్‌ చిత్రం ఓ భామ అయ్యో రామ లో దర్శకుడు హరీష్ శంకర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తాటి కల్లు ఆరోగ్య ప్రయోజనాలు

Night shifts: నైట్ షిఫ్ట్ చేస్తున్న మహిళలకు ఆస్తమా వచ్చే ప్రమాదం ఎక్కువ

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?

జామ ఆకుల టీ తాగితే?

ఇది షాకింగ్ వార్తే.. ఆల్కహాల్‌ కాలేయ వ్యాధులు.. మృతుల్లో మహిళలే ఎక్కువ

తర్వాతి కథనం
Show comments