Webdunia - Bharat's app for daily news and videos

Install App

దేశంలోనే తొలిసారి.. క్యాష్ ఆన్ వీల్ - రైలులో ఏటీఎం (Video)

ఠాగూర్
బుధవారం, 16 ఏప్రియల్ 2025 (16:32 IST)
దేశంలోనే తొలిసారి క్యాష్ ఆన్ వీల్ అందుబాటులోకి రానుంది. ముంబై నుంచి మన్మాడ్ వెళ్లే పంచవటి ఎక్స్‌ప్రెస్ రైలులో బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర తన ఏటీఎంను అమర్చింది. భారతీయ రైల్వే చరిత్రలోనే ఇలా రైలులో ఏటీఎంను అమర్చడం ఇదేతొలిసారి కావడం గమనార్హం. ఏసీ చైర్ కార్ కోచ్‌‍ చివరిలో సాధారణంగా ఉండే ప్యాంట్రీలో ఈ ఏటీఎంను ఏర్పాటుచేశారు. దీనికి ప్రత్యేకమైన షెటర్‌ను అమర్చారు. ఇప్పటికే దాని ట్రయల్ రన్ కూడా విజయవంతమైనట్టు రైల్వే అధికారులు తెలిపారు. దీంతో మన దేశంలో తొలిసారిగా ఏటీఎం సేవలు కలిగిన రైలుగా పంచవటి ఎక్స్‌ప్రెస్ చరిత్రపుటలకెక్కింది. 
 
ఇక ఈ ఏటీఎం రైలు కదులుతున్నపుడు కూడా ప్రయాణికులు నగదు విత్‌డ్రా చేసుకునే సౌలభ్యాన్ని కల్పించింది. దీనిని భారతీయ రైల్వేలో ఇన్నేవేటివ్ అండ్ నాన్ ఫేర్ రెవెన్యూ ఐడియాస్ స్కీమ్‌లో భాగంగా, ప్రవేశపెట్టారు. భారత రైల్వేల భూసావల్ విభాగం, బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర భాగస్వామ్యంతో ఈ అద్భుతమైన సౌకర్యం సాధ్యమైంది. 
 
దీనిపై భూసావల్ డివిజినల్ రైల్వే మేనేజర్ ఇతి పాండే స్పందిస్తూ, "ఫలితాలు బాగున్నాయి. ప్రజలు ఇపుడు ప్రయాణించేటపుడు నగదు విత్ డ్రా చేసుకోవచ్చు. ఏటీఎం పనితీరు మేము పర్యవేక్షిస్తున్నానే ఉంటాం" అని తెలిపారు. 

 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కృష్ణ లీల తో వివి వినాయక్ కు తిరిగొచ్చిన కాలం అవుతుందా !

థియేటర్లపై తప్పుడు ప్రచారాలు నమ్మొద్దు: తెలంగాణ స్టేట్ ఫిల్మ్ చాంబర్ ఆఫ్ కామర్స్

రీయూనియన్‌ కథతో రుష్య, మిర్నా మీనన్ జంటగా డాన్ బాస్కో

మహేంద్రగిరి వారాహి కోసం డబ్బింగ్ స్టార్ట్ చేసిన సుమంత్

అశ్విన్ పులిహార బాగా కలుపుతాడు - వెండితెర పై క్రికెటర్ కూడా : థమన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బరువు తగ్గడం కోసం 5 ఆరోగ్యకరమైన స్నాక్స్, ఏంటవి?

భారత్ లోకి రే-బాన్ మెటా గ్లాసెస్ మెటా ఏఐ ఇంటిగ్రేటెడ్, స్టైల్స్

పైల్స్ తగ్గేందుకు సింపుల్ టిప్స్

పసుపు, మిరియాల పొడిని కలిపిన గోల్డెన్ మిల్క్ తాగితే?

ప్రతి ఉదయం నా హృదయం నీకై పుష్పించెనులే

తర్వాతి కథనం
Show comments