Webdunia - Bharat's app for daily news and videos

Install App

టీకాలపై అనుమానాలు వద్దు : సుప్రీంకోర్టు

Webdunia
మంగళవారం, 26 అక్టోబరు 2021 (11:11 IST)
కరోనా వైరస్ వ్యాప్తి నియంత్రణ చర్యల్లో భాగంగా దేశ వ్యాప్తంగా సాగుతున్న కరోనా వ్యాక్సినేషన్ (టీకా)పై ఎలాంటి అనుమానాలు వ్యక్తం చేయాల్సిన అవసరం లేదని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. కొవిషీల్డ్, కొవాగ్జిన్‌ టీకాలను ప్రజలందరికీ ఇవ్వడాన్ని నిలుపుదల చేసేలా ఆదేశించాలని కోరుతూ దాఖలైన అప్పీలును కొట్టివేసిన సందర్భంగా ఈ వ్యాఖ్య చేసింది. 
 
అన్ని దశల క్లినికల్‌ పరీక్షలు ఇంకా పూర్తికానందున వీటిని ప్రజలందరికీ ఇవ్వకూడదంటూ ఇద్దరు వ్యక్తులు దాఖలు చేసిన వ్యాజ్యాన్ని తొలుత కర్ణాటక హైకోర్టు కొట్టివేసింది. అలాగే, రూ.50 వేల జరిమానా కూడా విధించింది. 
 
దీనిపై వారు సుప్రీంకోర్టులో అప్పీలు చేయగా జస్టిస్‌ డి.వై.చంద్రచూడ్, జస్టిస్‌ బి.వి.నాగరత్నలతో కూడిన ధర్మాసనం విచారణ జరిపింది. 'పిటిషన్‌ను కొట్టివేసి హైకోర్టు సరైన నిర్ణయమే తీసుకుంది. వాక్సినేషన్‌ ప్రక్రియపై అనుమానాలు వద్దు. ప్రజలను రక్షించడానికి ఇవే కీలకమైనవి' అని పేర్కొంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

క్రంచిరోల్, సోనీ పిక్చర్స్ డీమన్ స్లేయర్: కిమెట్సు నో యైబా.. తెలుగులో రాబోతోంది

Suhas: హే భగవాన్! నాకు హిట్ వచ్చేలా చేయ్ : సుహాస్

ఒత్తిడిలో ఉంటే మద్యం సేవిస్తా : పవన్ కళ్యాణ్ హీరోయిన్

ప్రపంచ వేదికపై మూడు రంగులు జెండా సంతోషాన్ని కలిగిస్తోంది : విజయ్ దేవరకొండ, రష్మిక

Nidhi: ప్రభాస్ రాజా సాబ్ తో పాటు మరో హారర్ థ్రిల్లర్ చిత్రంలో నిధి అగర్వాల్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జీడి పప్పులో వున్న పోషకాలు ఏమిటి?

వయోజనుల కోసం 20-వాలెంట్ న్యుమోకాకల్ కాంజుగేట్ వ్యాక్సిన్‌ను ఆవిష్కరించిన ఫైజర్

మెడికవర్ క్యాన్సర్ ఇన్‌స్టిట్యూట్ ఉచిత క్యాన్సర్ నిర్ధారణ వైద్య శిబిరం

పిట్యూటరీ గ్రంథి ఆరోగ్యకరంగా లేకపోతే సంతానం శూన్యం, ఎందుకంటే?

వేరుశనగ పల్లీలు తింటున్నారా?

తర్వాతి కథనం
Show comments