Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆధారాలు లేకుండా ఈవీఎంలను తప్పుబట్టలేం : సుప్రియా సూలే

ఠాగూర్
గురువారం, 26 డిశెంబరు 2024 (18:38 IST)
కాంగ్రెస్ పార్టీతో పాటు పలు రాజకీయ పార్టీలు ఈవీఎం పనితీరుపై నిందారోపణలు చేస్తున్నాయి. ఈవీఎంలను హ్యాక్ చేసి బీజేపీ ఎన్నికల్లో గెలుస్తుందంటూ ఆరోపణలు చేస్తున్నాయి. అయితే, ఎన్సీపీ సీనియర్ నేత, కేంద్ర మంత్రి మాజీ మంత్రి శరద్ పవార్ కుమార్తె, ఎంపీ సుప్రియా సూలే మాత్రం ఈవీఎంలను తప్పుబట్టడం లేదు. ఈవీఎంల ద్వారా జరిగిన ఎన్నికల్లో తాను నాలుగుసార్లు విజయం సాధించానని, అలాంటపుడు అందులో స్కాం ఉందని ఎలా చెప్పగలుగుతామని చెప్పారు. 
 
అయితే, ఈవీఎంలలో అవకతవకలపై కొంతమంది ఆరోపణలు చేస్తున్నారని, ఇందులో అవాస్తవాలను బయటకు తీసుకొచ్చేలా చర్చ జరగాల్సి ఉందని ఆమె అన్నారు. ఓటర్ల జాబితాపై చాలా మంది ప్రశ్నలు లేవనెత్తుతున్నారని, కాబట్టి ఈవీఎం అయినా, బ్యాలెట్ పేపర్ అయినా పారదర్శకంగా జరిగితే ఎలాంటి ఇబ్బంది లేదన్నారు. అయితే, ఇది తన వ్యక్తిగత అభిప్రాయమేనని చెప్పారు. ప్రజలు బ్యాలెట్ పేపర్ ద్వారానే ఎన్నికలు జరగాలని కోరుకుంటే అలాగే చేయాలని, ఈవీఎంలు కావాలనుకుంటే వాటినే ఏర్పాటు చేయాలని ఆమె సూచించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Bellamkonda Sai Sreenivas- బెల్లంకొండ సాయి శ్రీనివాస్‌పై కేసు నమోదు

Kamal: కమల్ హాసన్ థగ్ లైఫ్ ట్రైలర్ చెన్నై, హైదరాబాద్‌లో ఆడియో, విశాఖపట్నంలో ప్రీ-రిలీజ్

Samantha: రాజ్ నిడిమోరు-సమంతల ప్రేమోయణం.. శ్యామిలీ భావోద్వేగ పోస్టు

Ram: ఆంధ్ర కింగ్ తాలూకా- టైటిల్ గ్లింప్స్ లో రామ్ పోతినేని అదుర్స్

మే 16న థియేటర్లలో హైబ్రిడ్ 3డి చిత్రం 'లవ్లీ' రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

భారత్ లోకి రే-బాన్ మెటా గ్లాసెస్ మెటా ఏఐ ఇంటిగ్రేటెడ్, స్టైల్స్

పైల్స్ తగ్గేందుకు సింపుల్ టిప్స్

పసుపు, మిరియాల పొడిని కలిపిన గోల్డెన్ మిల్క్ తాగితే?

ప్రతి ఉదయం నా హృదయం నీకై పుష్పించెనులే

మిర్రోర్ సీనియర్ మహిళల కోసం రూపొందించిన MILY

తర్వాతి కథనం
Show comments