ఎన్నికల సిత్రాలు!! అభ్యర్థుల పాట్లు చూడతరమా?

Webdunia
బుధవారం, 24 మార్చి 2021 (07:31 IST)
మొత్తం 234 స్థానాలున్న తమిళనాడు అసెంబ్లీకి ఏప్రిల్‌ 6న ఎన్నికలు జరగనున్నాయి. ఫలితాలు మే 2న వెలువడనున్నాయి. ఈ నేపథ్యంలో రెండు ప్రధాన పార్టీలైన అన్నాడీఎంకే, డీఎంకే భారీ ఎత్తున ప్రచారం నిర్వహిస్తున్నాయి. సినీ నటుడు కమల్‌ హాసన్‌ పార్టీ మక్కల్ నీది మయ్యంతో కూడిన కూటమి, మరికొన్ని చిన్నాచితక పార్టీలు తలపడుతున్నాయి. 
 
అయితే, ఎన్నికల బరిలో ఉన్న అభ్యర్థులు మాత్రం విజయం కోసం పడరాని పాట్లు పడుతున్నారు. ఐదేళ్ళపాటు ఎక్కడున్నారో కూడా తెలియని నేతలు.. ఇపుడు వీధి వీధి తిరుగుతా.. సిత్రవిచిత్ర వేషాలు వేస్తున్నారు. 
 
ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు అభ్యర్థులు పడుతున్న పాట్లు చూస్తే ప్రతి ఒక్కరు నవ్వురాకుండా ఉండదు. తాజాగా అన్నాడీఎంకే అభ్యర్థి తంగ కదిరవన్ ఓటర్ల దృష్టి ఆకర్షించేందుకు వినూత్న ప్రయత్నం చేశారు. 
 
క్షేత్రస్థాయికి వెళ్లిన ఆయన ఓ చోట నేలపై కూర్చొని బట్టలు ఉతికారు. తాను గెలిస్తే వాషింగ్‌ మెషీన్లు కొనిస్తామని హామీ ఇచ్చారు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతోంది. నాగపట్టణం అసెంబ్లీ స్థానం నుంచి కదిరవన్ పోటీ చేస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఐబొమ్మ నిర్వాహకుడు ఇమ్మిడి రవిని ఎన్‌కౌంటర్ చేయాలి : నిర్మాత సి.కళ్యాణ్

నా సినిమాలు రీచ్ కాలేదు, త్వరలో డైరెక్షన్ చేస్తా : రాజ్ తరుణ్

ట్రెండ్ సెట్టింగ్ సైన్స్ ఫిక్షన్ మూవీగా కిల్లర్ సర్ ప్రైజ్ చేస్తుంది - డైరెక్టర్ పూర్వజ్

Rajamouli Contravarcy: హనుమంతుడిపై వ్యాఖ్యాలకు, వారణాసి టైటిల్ పై రాజమౌళి కు చెక్కెదురు

సంతాన ప్రాప్తిరస్తు రెస్పాన్స్ తో హ్యాపీగా ఉన్నాం - మధుర శ్రీధర్ రెడ్డి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మైగ్రేన్ నుండి వేగవంతమైన ఉపశమనం కోసం ఓరల్ ఔషధాన్ని ప్రారంభించిన ఫైజర్

తాటి బెల్లం తింటే 9 ప్రయోజనాలు, ఏంటవి?

నిమ్మకాయ టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

ఊపిరితిత్తుల సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

డయాబెటిక్ రెటినోపతిపై డాక్టర్ అగర్వాల్స్ కంటి ఆసుపత్రి అవగాహన కార్యక్రమం

తర్వాతి కథనం
Show comments