Webdunia - Bharat's app for daily news and videos

Install App

రైతన్నలకు కేంద్ర ప్రభుత్వం తీపి కబురు.. ఎరువులపై రాయితీ

Webdunia
గురువారం, 17 జూన్ 2021 (11:52 IST)
రైతన్నలకు కేంద్ర ప్రభుత్వం తీపి కబురు చెప్పింది. డీఏపీ ఎరువులపై కేంద్ర ప్రభుత్వం బస్తాకు రూ.700 రాయితీని పెంచింది. వ్యవసాయంలో అధిక శాతం వాడే డై అమ్మోనియా ఫాస్పేట్‌ డీఏపీపై పెంపునకు కేంద్రం ఆమోదం తెలిపింది. ఈ నిర్ణయంతో ప్రభుత్వంపై రూ.14,775 కోట్ల అదనపు భారం పడనుందని కేంద్ర మంత్రి మన్సుఖ్‌ మాండవియా తెలిపారు. గత నెల ప్రధాని మోడీ డీఏపీపై 140 శాతం రాయితీని పెంచాలని నిర్ణయించారు. ఈ నేపథ్యంలో నిర్వహించిన తాజా మంత్రివర్గ సమావేశంలో యూరియాపై రూ. 500 నుంచి రూ.1200 పెంచింది.
 
దీనివల్ల ఇప్పటి వరకు రూ.2400కు లభించిన డీపీఏ ఇక నుంచి రూ.1200 కే రైతులకు అందుబాటులో ఉండనుంది. డీఏపీ వల్ల రైతులకు ఎక్కువ మారిందని గ్రహించిన కేంద్రం రాబోవు ఖరీఫ్‌ సీజన్‌ వరకు గరిష్టంగా డీఏపీ రీటైల్‌ ధరలను గత సంవత్సరం ధరల మాదిరి అందుబాటులో పెట్టనుంది. 
 
కొన్ని కంపెనీలు డీఏపీ ధరలను పెంచినా.. కేంద్రం ఆ ధరలను తగ్గించి రైతులకు అందుబాటులోకి తేనుంది. కోవిడ్‌ ప్యాకేజీలో భాగంగానే రైతులపై భారం తగ్గించేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు కేంద్రం తెలిపింది. కొన్ని నెలల్లో అంతర్జాతీయంగా వ్యవసాయ, వ్యవసాయేతర వస్తువుల ధరలు తగ్గుముఖం పడతాయి, అప్పుడు ధరలను మరోసారి నిర్ణయిస్తామని తెలిపింది. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఫ్లాష్..ష్లాష్... అఖండ 2లో చైల్డ్ ఆర్టిస్టుగా హర్షాలి మల్హోత్రా !

సౌదీ అరేబియాలో ఘనంగా ఎన్టీఆర్‌ సినీ వజ్రోత్సవ వేడుకలు

గాయాలు, చేతిలో మంగళసూత్రం పట్టుకున్న ప్రదీప్ రంగనాథన్.. డ్యూడ్ ఫస్ట్ లుక్

యశ్వంత్ చిత్రం కథకళి ప్రారంభం చేయడం ఆనందంగా వుంది: నిహారిక

కామెడీ ఛాలెంజ్ లాంటిదే, బ్రహ్మానందం అభిమానంతో అలా చెప్పారు : వెన్నెల కిషోర్,

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Moringa Soup: మునగాకు సూప్ తాగితే మహిళలకు ఎంత మేలో తెలుసా?

ఆస్తమా రోగులు తినకూడని పదార్థాలు, ఏంటవి?

హైదరాబాద్‌లోని GKB ఆప్టికల్స్ స్టోర్‌ను సందర్శించిన క్రికెట్ స్టార్ పాట్ కమ్మిన్స్

Budget Friendly Foods: గుండె ఆరోగ్యానికి బడ్జెట్ ఫ్రెండ్లీ ఆహారాలేంటి?

తర్వాతి కథనం
Show comments