Webdunia - Bharat's app for daily news and videos

Install App

PMGKAY పథకం కింద నవంబర్ వరకు ఉచిత రేషన్

Webdunia
బుధవారం, 23 జూన్ 2021 (20:27 IST)
ration
ప్రధాన్ మంత్రి గరీభ్​ కల్యాణ్​​ యోజన (PMGKAY) పథకం కింద నవంబర్ వరకు ఉచిత రేషన్​ పంపిణీ ప్రతిపాదనకు కేంద్ర కేబినెట్ బుధవారం ఆమోదం తెలిపింది. దీంతో దాదాపు 80 కోట్ల మందికి మరో 5 నెలల పాటు ఉచితంగా రేషన్​ అందనుంది. 
 
కరోనా సమయంలో పేదలు ఇబ్బంది పడకుండా ఉచిత రేషన్​ సౌలభ్యాన్ని పొడిగించటం వరుసగా ఇది నాలుగోసారి. గతేడాది లాక్​డౌన్ దృష్ట్యా గరీభ్ కల్యాణ్​ అన్న యోజన ద్వారా పేదలకు 8 నెలలు ఉచిత రేషన్​ అందించారు. కరోనా సెకండ్ వేవ్​లో ఈ ఏడాది మే, జూన్​ వరకు అమలు చేశారు. కరోనా పరిస్థితుల్లో పేదలు ఇబ్బంది పడకుండా ప్రస్తుతం మరో ఐదు నెలలు పొడిగించారు. 
 
లబ్దిదారులైన ప్రతి వ్యక్తికి రేషన్ షాపుల ద్వారా 5 కేజీల చొప్పున ఉచిత ఆహార ధాన్యాలు ఇవ్వనున్నారు. దీని కోసం కేంద్రానికి రూ.64,031కోట్లు ఖర్చు అవుతుందని అంచనా. ఐదు నెలలకుగాను సుమారు 204 లక్షల టన్నుల ఆహార ధాన్యాలను పంపిణీ చేయనున్నారు.
 
కాగా, ఈ నెల ప్రారంభంలో జాతినుద్దేశించి చేసిన ప్రసంగంలో ప్రధాని నరేంద్ర మోదీ..దీపావళి వరకు పేదలకు ఉచిత రేషన్​ అందించనున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ ప్రతిపాదనకు ఇవాళ (జూన్-23,2021) మోదీ అధ్యక్షతన సమావేశమైన కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Pawan kalyan: అగ్ని ప్రమాదంలో పవన్ కల్యాణ్ కొడుకు మార్క్ శంకర్ - సింగపూర్ వెళ్ళనున్న పవన్

కీర్తి సురేష్‌కు 2025 బాగా కలిసొస్తుందా? ఆ ఫోటోలు వైరల్

నాగార్జున బోర్ కొట్టేశారా? బాలయ్య కోసం బిగ్ బాస్ నిర్వాహకులు పడిగాపులు?

దండోరాలో శివాజీ.. 25రోజుల పాటు కంటిన్యూగా షూటింగ్

యాక్షన్ ఎక్కువగా వున్న గుడ్ బ్యాడ్ అగ్లీ అజిత్ కుమార్ కు రాణిస్తుందా !

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మొబైల్ చూస్తూ మలవిసర్జన చేస్తున్నారా? అయితే అంతే..!!

ఈ చిన్న చిట్కాలు పాటిస్తే వేసవికాలంలో అధిక చెమటను నివారించవచ్చు!

హైదరాబాద్‌లోని బంజారా హిల్స్‌లో ది బేర్ హౌస్ స్టోర్ ప్రారంభం

చికెన్, మటన్ కంటే ఇందులో ప్రోటీన్లు ఎక్కువ? శాకాహారులకు బెస్ట్ ఫుడ్ ఇదే

మొలకెత్తిన బంగాళదుంపలు తింటే?

తర్వాతి కథనం
Show comments