Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఎన్.పి.ఆర్. చేపట్టాలి... అక్రమ విదేశీయుల లెక్క తేలుతుంది : రజినీకాంత్

Webdunia
బుధవారం, 5 ఫిబ్రవరి 2020 (14:25 IST)
దేశంలో ఉన్న అక్రమ విదేశీయుల లెక్కలు తేల్చాలంటే తక్షణం జాతీయ జనాభా పట్టికను చేపట్టాలని తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ అన్నారు. పైగా, జాతీయ పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ) వల్ల దేశంలోని ఏ ఒక్క ముస్లింకు నష్టం జరగదన్నారు. ఒక వేళ్ళ ఏదైనా నష్టం జరిగితే వారి తరపున పోరాడేందుకు తానే మొదటి వ్యక్తిని అవుతానని చెప్పారు. 
 
దేశ‌వ్యాప్తంగా ఆందోళ‌న‌కు దారితీస్తున్న పౌర‌స‌త్వ స‌వ‌ర‌ణ చ‌ట్టంపై ఆయన స్పందిస్తూ, పౌర‌స‌త్వ స‌వ‌ర‌ణ చ‌ట్టంతో ఎవ‌రికీ ఇబ్బంది ఉండ‌ద‌న్నారు. దేశ పౌరుల‌పై సీఏఏ ప్ర‌భావం ప‌డ‌ద‌ని ఆయ‌న స్ప‌ష్టం చేశారు. ఒక‌వేళ సీఏఏ వ‌ల్ల ముస్లింల‌కు న‌ష్టం జ‌రిగితే, వారి త‌ర‌పున పోరాడేందుకు తానే మొద‌టి వ్య‌క్తిని అవుతాన‌న్నారు. 
 
జాతీయ జ‌నాభా ప‌ట్టిక‌(ఎన్‌పీఆర్‌) వ‌ల్ల దేశంలో ఉన్న అక్ర‌మ విదేశీయుల లెక్క తెలుస్తుంద‌న్నారు. జాతీయ పౌర జాబితాపైన కూడా సూప‌ర్ స్టార్ స్పందించారు. ఎన్సార్సీ అమ‌లుపై ప్రభుత్వం ఇంకా ఎటువంటి నిర్ణ‌యం తీసుకోలేద‌న్నారు. 
 
జాతీయ పౌర జాబితా (ఎన్నార్సీ)ని దేశవ్యాప్తంగా అమలు చేయడంపై ఇంకా ఎటువంటి నిర్ణయం తీసుకోలేదని మంగ‌ళ‌వారం కేంద్రం స్పష్టం చేసిన విషయం తెల్సిందే. అదేవిధంగా జాతీయ జనాభా పట్టిక (ఎన్పీఆర్‌) కోసం వివరాలు సేకరించే సమయంలో పౌరుల నుంటి ఎటువంటి పత్రాలు కోరబోమన్నారు. 

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments