Webdunia - Bharat's app for daily news and videos

Install App

జీవించాల‌నే కోరిక చచ్చిపోయింది... జిల్లా కలెక్టర్ సూసైడ్

ఓ దారుణం జరిగింది. బీహార్ రాష్ట్రంలోని బక్సర్ జిల్లా కలెక్టర్ (మేజిస్ట్రేట్) ఆత్మహత్య చేసుకున్నారు. ఆ అధికారి పేరు ముఖేష్ పాండే. ఆయన మృతదేహాన్ని ఘజియాబాద్‌లోని ఓ రైల్వే ట్రాక్ వద్ద ఛిద్రమైన స్థితిలో ప

Webdunia
శుక్రవారం, 11 ఆగస్టు 2017 (14:10 IST)
ఓ దారుణం జరిగింది. బీహార్ రాష్ట్రంలోని బక్సర్ జిల్లా కలెక్టర్ (మేజిస్ట్రేట్) ఆత్మహత్య చేసుకున్నారు. ఆ అధికారి పేరు ముఖేష్ పాండే. ఆయన మృతదేహాన్ని ఘజియాబాద్‌లోని ఓ రైల్వే ట్రాక్ వద్ద ఛిద్రమైన స్థితిలో పోలీసులు కనుగొన్నారు. అయితే, తన ఆత్మహత్యకు ఏ ఒక్కరూ కారణం కాదనీ, తన సొంత నిర్ణయంతోనే బలవన్మరణానికి పాల్పడుతున్నానని పాండే తన సూసైడ్ నోట్‌లో పేర్కొన్నారు. 
 
"మనిషి అనేవాడికి ఈ భూమిపై మనుగడ లేదని త‌న‌కు జీవించాల‌నే కోరిక చచ్చిపోయిందని, త‌న మ‌ర‌ణం గురించి త‌న‌ కుటుంబ సభ్యులకు సమాచారం అందజేయండని" అని సూసైడ్ నోట్‌లో రాశాడు. 
 
అంతకుముందు ఆయన ఢిల్లీకి వెళ్లి అక్కడ ఉన్న లీలా ప్యాలెస్ హోటల్‌లోని 742 గదిలో బస చేశారు. ఈ గదిలో సూసైడ్ నోట్ కూడా రాసి ఉంచార‌ని పోలీసులు తెలిపారు. అలాగే ఆత్మ‌హ‌త్య‌కు పాల్ప‌డేముందు స‌ద‌రు క‌లెక్ట‌ర్ త‌న స్నేహితుల‌కు ఫోన్ చేసి, ఢిల్లీలోని జానకీపురిలోని ఓ షాపింగ్ మాల్ పైనుంచి దూకి ఆత్మ‌హ‌త్య చేసుకుంటాన‌ని చెప్పాడ‌ని అన్నారు. 
 
అయితే, ముఖేష్ పాండే రైల్వే స్టేషన్ వైపు వెళ్లి అక్క‌డ బ‌ల‌వ‌న్మ‌ర‌ణానికి పాల్ప‌డ్డారు. 2012 బ్యాచ్‌కు చెందిన ముకేష్ పాండేకు సమర్థుడైన అధికారిగా గుర్తింపు పొందడమేకాకుండా మంచి పేరు కూడా ఉంది. క‌లెక్ట‌ర్‌ మృతి పట్ల బీహార్ ముఖ్య‌మంత్రి నితీశ్‌ కుమార్ సంతాపం తెలిపారు. 

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments