Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఉత్తరాఖండ్‌లో ఘోరం.. పెళ్లి బృందం బస్సు బోల్తా - 25 మంది మృతి

Webdunia
బుధవారం, 5 అక్టోబరు 2022 (09:16 IST)
దేవభూమి ఉత్తరాఖండ్‌లో దసరా మహోత్సవం రోజున ఘోరం జరిగింది. పెళ్లి బృందంతో పెళుతున్న బస్సు ఒకటి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో 25 మృత్యువాపడ్డారు. హరిద్వార్ నుంచి పౌరీ జిల్లాలోని బీర్ఖల్ జిల్లాలో ఈ ఘటన జరిగింది. ఈ బస్సు అదుపుతప్పి రోడ్డు బ్యారియర్లను దాటుకుని చెట్టును ఢీకొట్టి లోయలోపడింది. రాత్రిపూట ఈ ప్రమాదం జరగడంతో చీకట్లో సహాయక చర్యలు చేపట్టడంలో తీవ్ర జాప్యం నెలకొంది. ఈ ప్రమాదం వార్త తెలిసిన ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి తీవ్ర విచారం వ్యక్తం చేశారు. 
 
ప్రమాదానికి గురైన బస్సు హరిద్వార్ జిల్లా నుంచి పౌరి జిల్లాలోని బీర్ఖల్ బ్లాకుకు వెళుతుండగా, రిఖ్నింఖల్ బిరోంఖల్ మోటార్ రోడ్డు సమీపంలో సిమ్ది గ్రామంలో బస్సు అదుపుతప్పి 500 మీటర్ల లోతైన నాయర్ నది లోయలోకి దూసుకెళ్ళింది. ప్రమాద స్థలంలోనే 25 మంది భావిస్తున్నారు. అయితే, ప్రమాద స్థలంలో ఉన్న అధికారులు మాత్రం మృతుల సంఖ్యపై స్పష్టత ఇవ్వడంలేదు. ప్రమాద స్థలంలో సహాయక చర్యలు ముమ్మరంగా సాగుతున్నాయి. 
 
కాగా, గత యేడాది జూన్ నెలలోనూ ఇలాంటి ఘటనే జరిగింది. ఉత్తర కాశీ జిల్లాలో బస్సు ఒకటి 250 మీటర్ల లోతులోయలోకి దూసుకెళ్లింది. ఈ ఘటనపై మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని పన్నా జిల్లాకు చెందిన 25 మంది ప్రాణాలు కోల్పోయారు. యమునోత్రిధామ్ నుంచి యాత్రికులను తీసుకుని వెళుతుండగా ఈ ప్రమాదం జరిగింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సెన్సార్ పూర్తి చేసుకున్న సోషియోఫాంటసీగా దీర్ఘాయుష్మాన్ భవ

సూర్య సేతుపతి హీరోగా పరిచయమవుతున్న మూవీ ఫీనిక్స్

కీర్తి సురేష్, సుహాస్ ఉప్పు కప్పురంబు మ్యూజిక్ ఆల్బమ్

SJ Surya: ఎస్‌జె సూర్య దర్శకత్వంలో శ్రీ గొకులం మూవీస్‌ టైటిల్ కిల్లర్

డ్రగ్స్ వ్యతిరేక ప్రచారాన్ని బాధ్యతగా తీసుకుంటా - విజయ్ దేవరకొండ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డయాబెటిస్, ఏముందిలే ఇవి తినేద్దాం అనుకోరాదు, ఏంటవి?

ఆల్‌బుకరా పండ్లు తింటే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

తల గాయంను అంచనా వేయడానికి ల్యాబ్ ఆధారిత రక్త పరీక్షను ప్రవేశపెట్టిన అబాట్

గోరింటతో ఆరోగ్యం, అందం

వ్రిటిలైఫ్ ఆయుర్వేద చర్మ సంరక్షణ శ్రేణికి ప్రచారకర్తలుగా స్మృతి మంధాన, మణికా బాత్రా

తర్వాతి కథనం
Show comments