Webdunia - Bharat's app for daily news and videos

Install App

అనాసాగర్ సరస్సులో కొట్టుకొచ్చిన రూ.2 వేల నోట్ల కట్టలు

Webdunia
ఆదివారం, 8 మే 2022 (09:39 IST)
రాజస్థాన్ రాష్ట్రంలోని అజ్మీర్‌లో ఉన్న అనాసాగర్ సరస్సులో 2 వేల రూపాయల నోట్ల కట్టలు కొట్టుకునివచ్చాయి. వీటిని చూసిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. సరస్సులో కరెన్సీ నోట్ల కట్టలు కొట్టుకొచ్చినట్టు వార్తలు రావడం స్థానికంగా కలకలం రేపింది. 
 
ఈ నోట్ల కట్టలకు సంబంధించి సమాచారం అందుకున్న పోలీసులు నోట్ల కట్టలను స్వాధీనం చేసుకున్నారు. అయితే, అవి పూర్తిగా తడిచిపోయి ఉండటంతో వాటిని లెక్కించడం సాధ్యపడలేదని ఎస్పీ బల్దేవ్ సింగ్ తెలిపారు. అయితే, ఈ నోట్ల కట్టలను సరస్సులో ఎవరు విసిరేశారన్న అంశంపై దర్యాప్తు సాగిస్తున్నట్టు చెప్పారు. 
 
అయితే, ఈ సరస్సులో కొట్టుకొచ్చిన రూ.2 వేల నోట్ల కట్టలు నకిలీవనే ప్రచారం సాగుతోంది. కానీ, పోలీసులు మాత్రం ఈ వార్తలను కొట్టపారేస్తున్నారు. నోట్ల కట్టలపై ఆర్బీఈ రబ్బర్ స్టాంపు కూడా ఉందని తెలిపారు ఓ పాల్తీన్ కవర్‌లో కట్టి వీటిని సరస్సులో విసిరేశారని వారు వెల్లడించారు.  

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

నాగేశ్వరరావు గారి ఫ్యాన్స్ తో కలిసి భోజనాలు, బట్టలు పంపిణీ చేసిన అక్కినేని కుటుంబం

మన్యం ధీరుడు.. సీతారామరాజు చిత్రం ఎలా వుందంటే.. రివ్యూ

చిరంజీవికి అక్కినేని నాగేశ్వరరావు శతజయంతి అవార్డ్ ప్రకటించిన నాగార్జున

జయం రవి కాపురంలో చిచ్చుపెట్టిన బెంగుళూరు సింగర్?

ఫియర్ ద్వారా ఆ లిస్టులో ఇండియా పేరు చూసినప్పుడు గర్వంగా అనిపించింది: దర్శకురాలు హరిత

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డ్రాగన్ ఫ్రూట్ తింటే ప్రయోజనాలు ఏమిటి?

బ్రెయిన్ ట్యూమర్‌తో బాధపడుతున్న 7 ఏళ్ల బాలుడికి అమెరికన్ ఆంకాలజీ విజయవంతంగా చికిత్స

పీసీఓఎస్ అవగాహన మాసం: సహజసిద్ధంగా పీసీఓఎస్ నిర్వహణకు చిట్కాలు

యూఎస్ పోలో ఆసన్‌తో కలిసి శ్రీ సవాయి పద్మనాభ్ సింగ్ కలెక్షన్

మణిపాల్ హాస్పిటల్‌కు ఎన్ఏబీహెచ్ డిజిటల్ హెల్త్ అక్రిడిటేషన్-గోల్డ్ లెవెల్

తర్వాతి కథనం
Show comments