Webdunia - Bharat's app for daily news and videos

Install App

యూపీలో విషాదం : విషం తిని బీఎస్పీ నేత ఆత్మహత్య

Webdunia
ఆదివారం, 7 ఫిబ్రవరి 2021 (10:39 IST)
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఓ విషాదకర ఘటన జరిగింది. యూపీలోని బదాయూ జిల్లా పరిధిలోని సహస్వాన్ అసెంబ్లీ నియోజకవర్గం బీఎస్పీ మాజీ అధ్యక్షుడు హర్‌వీర్(30) తహసీల్ పరిసరాల్లో విషాహారం తిన్నాడు. చికిత్స కోసం ఆసుపత్రికి తీసుకెళుతుండగా దారిలో మృతి చెందాడు. 
 
తన భూమిని క్రమబద్ధీకరించుకునేందుకు వచ్చిన హర్‌వీర్‌ను సోమవారం రావాలని ఎస్డీఎం చెప్పారు. ఈ నేపధ్యంలో హర్‌వీర్ ఎస్డీఎంతో వాదనకు దిగాడు. ఈ నేపథ్యంలోనే హర్‌వీర్ విషాహారం తిన్నాడు. ఈ ఉదంతంపై విచారణకు డీఎం ఆదేశించారు. 
 
మరోవైపు పోలీసులు హర్‌వీర్ మృతదేహాన్ని పోస్టుమారం కోసం తరలించారు. మృతుని కుటుంబీకులు తెలిపిన వివరాల ప్రకారం పదేళ్ల క్రితమే ఈ భూమి పట్టా హర్‌వీర్ పేరిట నమోదైవుంది. ఇప్పుడు దానిని క్రమబద్ధీకరించుకునేందుకు హర్‌వీర్ దరఖాస్తు చేసుకున్నాడు. 
 
ఈ ఫైలు తహసీల్‌కు చేరింది. ఈ నేపథ్యంలో హర్‌వీర్ ఎస్డీఎం‌ను కలుసుకుని, తన సమస్య విన్నవించుకున్నాడు. అయితే ఎస్డీఎం అతనితో సోమవారం రావాలని చెప్పారు. దీంతో కలత చెందిన హర్‌వీర్ విషాహారం తీసుకున్నాడు. 
 
దీనిని గమనించిన స్థానికులు వెంటనే బాధితుడిని ఆసుపత్రికి తరలించారు. అయితే దారిలోనే హర్‌వీర్ మృతి చెందాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Kingdom: యాక్షన్ ప్రోమోతో విజయ్ దేవరకొండ కింగ్‌డమ్ కొత్త అప్ డేట్

మాధవరం గామాన్ని ఆదర్శంగా Mr. సోల్జర్ చిత్రం సిద్ధం

AR Rahman: ఎస్‌జె సూర్య పాన్ ఇండియా ఫిల్మ్ కిల్లర్ కు ఏఆర్ రెహమాన్ మ్యూజిక్

విజయ్ సేతుపతి, సంయుక్త, పూరి జగన్నాథ్ చిత్రం రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం

Sridevi: కేజేఆర్ హీరోగా కోర్ట్ ఫేమ్ శ్రీదేవి హీరోయిన్ గా చిత్రం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆ మొక్క ఆకులో నానో బంగారు కణాలు!!

బరువు తగ్గాలనుకుంటున్నారా? సగ్గుబియ్యం ఓ వరం!

నేరేడు పళ్ల సీజన్... నేరేడు ప్రయోజనాలెన్నో!

Back pain: మహిళలకు వెన్నునొప్పి ఎందుకు వస్తుందో తెలుసా?

చక్కగా కొవ్వును కరిగించే చెక్క

తర్వాతి కథనం
Show comments