పాము కాటుతో అన్న మృతి: అంత్యక్రియలకు వచ్చిన సోదరుడినీ కాటేసిన పాము

Webdunia
శుక్రవారం, 5 ఆగస్టు 2022 (11:35 IST)
అన్నదమ్ములపై విధి పగపట్టిందా అనేట్లు ఓ విషాదకర సంఘటన చోటుచేసుకుంది. పాము కాటుకి అన్నయ్య చనిపోతే అతడి అంత్యక్రియలు చేసేందుకు వచ్చిన తమ్ముడిని కూడా పాము కాటు వేసింది. దీనితో అక్కడ విషాద ఛాయలు అలముకున్నాయి.

 
పూర్తి వివరాలను పరిశీలిస్తే... ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో భవానీపూర్‌కి చెందిన 38 ఏళ్ల అరవింద్ మిశ్రా మంగళవారం రాత్రి పాముకాటుకి గురయ్యాడు. చికిత్స అందించేలోపే కన్నుమూశాడు. సమాచారం అందుకున్న అతడి తమ్ముడు గోవింద మిశ్రా తన అన్నయ్య అంత్యక్రియలు చేసేందుకు వచ్చాడు. బుధవారం అంత్యక్రియలు పూర్తి చేసి ఇంట్లో నిద్రిస్తున్నాడు.

 
ఆ సమయంలో మరో పాము గోవింద మిశ్రాను కరిచింది. దీనితో అతడు అక్కడికక్కడే మృతి చెందాడు. ఇతడితో పాటు మరో వ్యక్తిని కూడా కాటు వేసింది. అతడి ఆరోగ్య పరిస్థితి ఆందోళనకరంగా వుందని వైద్యులు చెప్పారు. ఈ విషాదకర వార్త తెలుసుకున్న నియోజకవర్గ ఎమ్మెల్యే కైలాస్ నాథ్ బాధితుల ఇంటికి వెళ్లి పరామర్శించారు. ప్రభుత్వ తరపున తగిన సాయం అందించి ఆదుకుంటామని తెలిపారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'ది గర్ల్ ఫ్రెండ్' కోసం ముఖ్య అతిథిగా హాజరుకానున్న విజయ్ దేవరకొండ?

నవంబర్ 15న జియోహాట్‌స్టార్‌లో ఎస్ఎస్ రాజమౌళి గ్లోబ్‌ట్రోటర్ ఫస్ట్ లుక్, టీజర్ లాంచ్‌ లైవ్ స్ట్రీమ్

మహిళల శరీరాకృతి ఎపుడూ ఒకేలా ఉండదు : మిల్కీ బ్యూటీ

కోలీవుడ్ హీరో అజిత్ ఇంటికి బాంబు బెదిరింపు

అలాంటి పాత్రలు వస్తే మొహమాటం లేకుండా నో చెప్పేస్తా : మీనాక్షి చౌదరి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

క్యాలీఫ్లవర్‌ 8 ప్రయోజనాలు ఏమిటి?

స్ట్రోక్ తర్వాత వేగంగా కోలుకోవడానికి రోబోటిక్ రిహాబిలిటేషన్ కీలకమంటున్న నిపుణులు

రోజుకి ఒక్క జామకాయ తింటే చాలు...

బ్లెండర్స్ ప్రైడ్ ఫ్యాషన్ టూర్ సిద్ధం చేసింది ఫ్యాషన్ ముందడుగు

శరీరంలో కొలెస్ట్రాల్ పేరుకుపోతే ఎలాంటి లక్షణాలు కనబడతాయి?

తర్వాతి కథనం
Show comments