Webdunia - Bharat's app for daily news and videos

Install App

పాము కాటుతో అన్న మృతి: అంత్యక్రియలకు వచ్చిన సోదరుడినీ కాటేసిన పాము

Webdunia
శుక్రవారం, 5 ఆగస్టు 2022 (11:35 IST)
అన్నదమ్ములపై విధి పగపట్టిందా అనేట్లు ఓ విషాదకర సంఘటన చోటుచేసుకుంది. పాము కాటుకి అన్నయ్య చనిపోతే అతడి అంత్యక్రియలు చేసేందుకు వచ్చిన తమ్ముడిని కూడా పాము కాటు వేసింది. దీనితో అక్కడ విషాద ఛాయలు అలముకున్నాయి.

 
పూర్తి వివరాలను పరిశీలిస్తే... ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో భవానీపూర్‌కి చెందిన 38 ఏళ్ల అరవింద్ మిశ్రా మంగళవారం రాత్రి పాముకాటుకి గురయ్యాడు. చికిత్స అందించేలోపే కన్నుమూశాడు. సమాచారం అందుకున్న అతడి తమ్ముడు గోవింద మిశ్రా తన అన్నయ్య అంత్యక్రియలు చేసేందుకు వచ్చాడు. బుధవారం అంత్యక్రియలు పూర్తి చేసి ఇంట్లో నిద్రిస్తున్నాడు.

 
ఆ సమయంలో మరో పాము గోవింద మిశ్రాను కరిచింది. దీనితో అతడు అక్కడికక్కడే మృతి చెందాడు. ఇతడితో పాటు మరో వ్యక్తిని కూడా కాటు వేసింది. అతడి ఆరోగ్య పరిస్థితి ఆందోళనకరంగా వుందని వైద్యులు చెప్పారు. ఈ విషాదకర వార్త తెలుసుకున్న నియోజకవర్గ ఎమ్మెల్యే కైలాస్ నాథ్ బాధితుల ఇంటికి వెళ్లి పరామర్శించారు. ప్రభుత్వ తరపున తగిన సాయం అందించి ఆదుకుంటామని తెలిపారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

తెలుగుదనం ఉట్టిపడేలా పంచె కట్టులో బాలయ్య - పద్మభూషణ్ అవార్డు స్వీకరణ

నూతన టాలెంట్ తో మ్యూజిక‌ల్ డ్రామాగా నిల‌వే టీజ‌ర్ విడుద‌ల‌

సింగిల్ కథ కార్తీక్ చెప్తున్న రెండు గంటలు నవ్వుతూనే ఉన్నా: అల్లు అరవింద్

విజయ్ సేతుపతి, పూరి జగన్నాథ్ చిత్రంలో వీరసింహారెడ్డి ఫేమ్ విజయ్ కుమార్

సమంతకు గుడికట్టించిన వీరాభిమాని (Video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మణిపాల్‌ హాస్పిటల్‌ విజయవాడలో ఎక్మో సేవలు, క్లిష్టమైన సంరక్షణలో కొత్త ఆశాకిరణం

మామిడి పండ్లు తింటే 8 ప్రయోజనాలు, ఏంటవి?

డిజైన్ వాన్‌గార్డ్ 2025ను నిర్వహించిన వోక్సెన్ విశ్వవిద్యాలయం

'ది గ్రీన్ ఫ్లీ'ను ప్రారంభించిన ఇనార్బిట్ సైబరాబాద్

టమోటాలను తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments