Webdunia - Bharat's app for daily news and videos

Install App

పెళ్లైన వారం రోజుల్లోనే నవ వధువు ఆత్మహత్య.. కారణం అదే?

Webdunia
బుధవారం, 2 సెప్టెంబరు 2020 (09:38 IST)
పెళ్లైన వారం రోజుల్లోనే నవ వధువు ఆత్మహత్యకు పాల్పడిన ఘటన తమిళనాడులోని వేలూరులో వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళితే.. వేలూరు సమీప గ్రామానికి చెందిన యువతికి కాట్పాడికి చెందిన బాలాజీ అనే యువకుడితో ఆగస్టు 23వ తేదీన వివాహం ఘనంగా జరిగింది. ఇక నూతన దంపతుల కోసం విందు ఏర్పాటు చేయగా మూడు రోజుల క్రితం యువతి ఇంటికి వెళ్లారు ఈ కొత్త జంట.
 
కాగా ఆదివారం రాత్రి ఇంటి మేడపై ఒంటరిగా వుండిన నవవధువు గదిలోంచి కేకలు వినిపించాయి. కంగారు పడిపోయిన కుటుంబ సభ్యులు వెంటనే వెళ్లి చూడగా... నవవధువు ఒంటిపై కిరోసిన్ పోసుకుని మంటల్లో కాలిపోతూ కనిపించింది.
 
ఇక వెంటనే అప్రమత్తమైన కుటుంబ సభ్యులు మంటలు ఆర్పి వెంటనే ఆస్పత్రికి తరలించారు దీనిపై సమాచారం అందుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. బాధిత యువతి వద్ద వాంగ్మూలం తీసుకున్నారు. ఆ తరువాత కాసేపటికి చికిత్స పొందుతూ ఆ యువతి కన్నుమూసింది. 
 
ఇక ఆ గదిలో రాసిన సూసైడ్ నోట్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. తాళి కట్టిన రోజు నుంచి భర్త అనుమానంతో వేధిస్తున్నాడని ఎవరితో మాట్లాడిన సూటిపోటి మాటలు అంటూ మానసికంగా క్షోభకు గురి చేస్తున్నాడని అందులో రాసివుంది. దీంతో పోలీసులు అతనిని అరెస్ట్ చేసి విచారణ జరుపుతున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Nara Lokesh: పవన్ కల్యాణ్ అన్న స్వాగ్ నాకు చాలా ఇష్టం: నారా లోకేష్

Pawan: సత్యానంద్ నుంచి ధైర్యాన్ని, జీవిత పాఠాలను నేర్చుకున్నా : పవన్ కళ్యాణ్

నా పేరు పవన్... అన్ని చోట్లా ఉంటా... వాళ్లకు వాతలు పెడతా : పవన్ కళ్యాణ్

షూటింగ్ లో అడివి శేష్, మృణాల్ ఠాకూర్ కు స్వల్పగాయాలు !

అర్జున్ రెడ్డి తర్వాత విజయ్ దేవరకొండ సరైన సినిమా లేదు: నిర్మాత నాగవంశీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

Monsoon: వర్షాకాలం.. గ్లాసుడు గోరువెచ్చని నీరు బెస్ట్.. సలాడ్స్, చల్లని పానీయాలు వద్దు

అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

వాన చినుకులతో వచ్చేసాయ్ మొక్కజొన్న పొత్తులు, ఇవి తింటే?

తర్వాతి కథనం
Show comments