Webdunia - Bharat's app for daily news and videos

Install App

అప్పగింతలు.. అతిగా ఏడ్చిన వధువు.. గుండెపోటుతో మృతి

Webdunia
శనివారం, 6 మార్చి 2021 (11:55 IST)
పెళ్లి వైభవంగా ముగిసింది. కానీ అప్పగింతలే ఆ వధువుకు ప్రాణాల మీదకు తెచ్చింది. పెళ్ళి చేసుకున్న అనంతరం వరుడు కుటుంబానికి వధువును తల్లిదండ్రులు అప్పగిస్తారు. ఆ సమయంలో వధువు కుటుంబ సభ్యులు కన్నీటిపర్యంతమవుతుంటారు. తమ కుమార్తెకు ఎలాంటి కష్టం రానీయకుండా చూసుకోవాలని, ఏదైనా తప్పులు జరిగితే సర్దుకు పోవాలంటూ.. అప్పగిస్తుంటారు. 
 
ఇక సున్నితమైన మనస్కులు వారైతే.. ఏడుస్తూ…కుప్పకూలిపోతుంటారు. ఇలాగే ఓ ఘటన ఒకటి చోటుచేసుకుంది. అత్తారింటికి వెళ్లే సమయంలో.. అతిగా ఏడుస్తూ.. వధువు మృతి చెందింది. ఈ ఘటన ఒడిసా రాష్ట్రంలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. సోనేపూర్ జిల్లాలో గుప్తేశ్వరి సాహూకు ఓ యువకుడి తో వివాహం జరిగింది. మరుసటి రోజు..అత్తారింటికి పంపేందుకు ఏర్పాట్లు చేశారు. 
 
నవ వధువుకు వీడ్కోలు పలుకుతుండగా ఒక్కసారిగా ఆమె సృహ కోల్పోయింది. వెంటనే కుటుంబసభ్యులు ఆసుపత్రికి తరలించారు. పరీక్షలు జరపగా..ఆమె చనిపోయిందని నిర్ధారించారు. అప్పగింతల్లో అతిగా ఏడ్వడం వల్ల గుండెపోటు వచ్చిందని, దీంతో వధువు చనిపోయినట్లు పేర్కొన్నారు.
 
నీరసం వల్లే సృహ కోల్పోయిందని భావించామని..ఇంత ఘోరం జరుగుతుందని అనుకోలేదని వధువు కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరుగా విలపించారు. ఈ ఘటనతో స్థానికంగా విషాద ఛాయలు అలుముకున్నాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

నా మనసుకు చేరువైన పాత్ర ఏదీ లేదు : పవన్ కళ్యాణ్

హీరో విజయ్ దేవరకొండపై అట్రాసిటీ కేసు

Sekhar Kammula: సరస్వతి దేవి తల ఎత్తుకొని చూసే సినిమా కుబేర : శేఖర్ కమ్ముల

రవితేజ, రిచా గంగోపాధ్యాయ్ బ్లాక్ బస్టర్ మిరపకాయ్ రీ రిలీజ్

ఫ్యామిలీ ఫెయిల్యూర్ స్టోరీ నేపథ్యంగా స:కుటుంబానాం చిత్రం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శరీరానికి శక్తినిచ్చే బాదం, రాగి మాల్ట్‌ ఇలా చేయాలి

ఈ పండ్లు తింటే శరీరానికి కావలసినంత ప్రోటీన్

మిట్రల్ రెగర్జిటేషన్ చికిత్స: దేశంలో ట్రాన్స్‌కాథెటర్-ఎడ్జ్-టు-ఎడ్జ్ రిపేర్ సిస్టం మైక్లిప్‌ను ప్రారంభించిన మెరిల్

మలాసనం వేసి గోరువెచ్చని మంచినీళ్లు తాగితే?

బిస్కెట్లు తింటే ఆకలి తీరుతుందేమో కానీ...

తర్వాతి కథనం
Show comments