Webdunia - Bharat's app for daily news and videos

Install App

షేమ్ షేమ్.. వరుడికి లెక్కలు రాలేదా.. పెళ్లి వద్దన్న వధువు!

Webdunia
సోమవారం, 4 మే 2015 (14:47 IST)
షేమ్ షేమ్.. వరుడికి లెక్కలు రాలేదని తెలిసి.. వధువు పెళ్లి వద్దనుకుంది. వరుడికి లెక్కలు రాలేదని చెప్పి వధువు పెళ్లి పీటల మీదే నో చెప్పిన సంఘటన ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలోని బలియా జిల్లాలో జరిగింది. దీంతో పీటల మీద పెళ్లి ఆగిపోయింది. వరుడు కరెన్సీ నోట్లు లెక్కపెట్టడంలో విఫలమయ్యాడు.

ఉత్తర ప్రదేశ్ రాష్ట్రానికి చెందిన మనోజ్, బీహార్ రాష్ట్రానికి చెందిన ఓ అమ్మాయికి పెళ్లి ఖాయమైంది. వరుడు మనోజ్ గ్రామంలో శుక్రవారం పెళ్లి ముహూర్తం. అయితే పెళ్లి జరుగుతుండగా వ్యవహరిస్తున్న తీరును చూస్తే వరుడు నిరక్షరాస్యుడని వధువు భావించింది.
 
మగపెళ్లి వారు ఆ విషయాన్ని దాచి పెట్టారేమోనని గ్రాడ్యుయేట్ అయిన వధువుకు అనుమానం వచ్చింది. దీంతో అతడికి కరెన్సీ నోట్లు ఇచ్చి.. పందిట్లోనే లెక్క పెట్టమని చెప్పింది. ఆ పరీక్షలో వరుడు నెగ్గలేకపోయాడు. అతను తెల్ల మొహం వేయడంతో అతనితో వధువు పెళ్లి వద్దనుకుంది. ఇక చేసేదేమీ లేకుండా అతని తరపు బంధువులు పెళ్లి రద్దు చేసుకుని వెళ్లిపోవాల్సి వచ్చింది.

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

Show comments