Webdunia - Bharat's app for daily news and videos

Install App

దోషిగా డేరా బాబా... మరో నలుగురిని కూడా దోషులుగా తేల్చిన కోర్టు

Webdunia
శుక్రవారం, 8 అక్టోబరు 2021 (13:27 IST)
డేరా బాబా అలియాస్.. గుర్మీత్ రామ్ రహీమ్ సింగ్‌తో పాటు మరో నలుగురిని ఓ హత్య కేసులో దోషులుగా హరియాణాలోని సీబీఐ ప్రత్యేక కోర్టు తేల్చింది. అక్టోబర్ 12న వారికి శిక్ష ఖరారు చేయనున్నట్టు తెలిపింది. 
 
వివరాల్లోకెళ్తే.. 2002లో రంజిత్ సింగ్ అనే వ్యక్తి హత్యకు గురయ్యాడు. ఈ కేసును 2003లో సీబీఐకి అప్పగించారు. దాంతో ఈ కేసులో మొత్తం ఆరుగురు నిందితులను అధికారులు అదుపులోకి తీసుకున్నారు. 
 
ఈ మేరకు విచారణ చేపట్టిన కోర్టు.. రామ్ రహీమ్ సింగ్ తో పాటు క్రిష్ణలాల్, జస్వీర్, సబ్దిల్, అవతార్ లను దోషులుగా తేల్చింది. అయితే నిందితుల్లో ఒకరు ఇప్పటికే మరణించారు. ఇక జర్నలిస్ట్ రామచంద్ర ఛత్రపతి హత్య సహా మహిళా అనుచరులపై లైంగికదాడి కేసులో ఇప్పటికే డేరా బాబా శిక్ష అనుభవిస్తూ సునారియా జైలులో ఉన్నారు. 
 
గుర్మీత్ రామ్ రహీమ్ సింగ్ తన ఆశ్రమంలో తన ఇద్దరు మహిళా శిష్యులపై అత్యాచారం చేసినందుకు 20 సంవత్సరాల జైలు శిక్ష అనుభవిస్తున్నాడు. 2017 ఆగస్టులో పంచకుల ప్రత్యేక సీబీఐ కోర్టు అతడిని దోషిగా నిర్ధారించింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రియల్ లవ్ కోరుకునే మిస్టర్ రోమియో టీజర్ లాంచ్ చేసిన శ్రియా శరణ్

Keerthy Suresh: కీర్తి సురేష్ సినిమా మార్కెట్ పడిపోయిందా?

Chiru: ఇంటిలిజెన్స్ ఆఫీసర్ గా చిరంజీవి చిత్రం మన శివశంకరప్రసాద్ పండగకు వస్తున్నారు

Parada Review: అనుపమా పరమేశ్వరన్‌ పరదా మెప్పించిందా లేదా - పరదా రివ్యూ

సినీ కార్మికులకు వేతనాలు పెంపు.. సీఎం రేవంత్‌కు చిరు థ్యాంక్స్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శక్తినిచ్చే ఖర్జూరం పాలు, మహిళలకు పవర్ బూస్టర్

అబోట్ నుంచి నిరంతర గ్లూకోజ్ రీడింగులు అలర్ట్‌లతో కూడిన నెక్స్ట్-జెన్ ఫ్రీస్టైల్ లిబ్రే 2 ప్లస్‌

ఈ ఆయుర్వేద సూపర్‌ఫుడ్‌లతో రుతుపవనాల వల్ల వచ్చే మొటిమలకు వీడ్కోలు చెప్పండి

తెల్ల నువ్వులతో ఆరోగ్య ప్రయోజనాలు

కాలేయ సమస్యలను అడ్డుకునే తేనెలో ఊరబెట్టిన ఉసిరి

తర్వాతి కథనం
Show comments