Webdunia - Bharat's app for daily news and videos

Install App

తాగునీటి కోసం నదివద్దకు వెళ్లిన బాలుడు.. మొసలి నోటికి ఎర

Webdunia
సోమవారం, 22 మే 2023 (11:04 IST)
కర్నాటక రాష్ట్రంలో ఓ విషాదకర ఘటన జరిగింది. తాగునీటి కోసం నది వద్దకు వెళ్లిన ఓ బాలుడు అదృశ్యమయ్యాడు. ఆ బాలుడిపై మొసలి దాడి చేసి నోట కరుచుకుని నదిలోకి వెళ్లిపోయింది. ఈ ఘటన కర్నాటక రాష్ట్రంలోని రాయచూరు తాలూకాలోని కృష్ణానదిలో జరిగింది. మృతుడిని ఈ తాలూకాలోని నడిగడ్డు గ్రామమైన కొర్వకులకు చెందిన బాలుడుగా గుర్తించారు.

నవీన్ (9) అనే బాలుడు ఆదివారం తన తల్లిదండ్రులతో కలిసి నదీ తీరంలో ఉన్న పొలం వద్దకెళ్లాడు. తాగునీటి కోసం మరో బాలుడితో కలిసి నదిలోకి వెళ్లి బాటిల్‌లో నీరు నింపుకొంటుండగా మొసలి.. నవీన్‌ను నోట కరచుకుని వెళ్లింది. ఈ భయానక దృశ్యాన్ని చూసిన మరో బాలుడు రోదిస్తూ విషయాన్ని పెద్దలకు చెప్పాడు.

గ్రామస్థులు నది వద్దకెళ్లి చూడగా నవీన్ జాడ కనిపించలేదు. సమాచారం అందుకున్న పోలీసులు.. అగ్నిమాపక సిబ్బందితో కలిసి బాలుడి ఆచూకీ కోసం గాలించినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. రాత్రి వరకు బాలుడి జాడ కానరాలేదు. దీనిపై స్థానిక పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు.

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments