Webdunia - Bharat's app for daily news and videos

Install App

తాగునీటి కోసం నదివద్దకు వెళ్లిన బాలుడు.. మొసలి నోటికి ఎర

Webdunia
సోమవారం, 22 మే 2023 (11:04 IST)
కర్నాటక రాష్ట్రంలో ఓ విషాదకర ఘటన జరిగింది. తాగునీటి కోసం నది వద్దకు వెళ్లిన ఓ బాలుడు అదృశ్యమయ్యాడు. ఆ బాలుడిపై మొసలి దాడి చేసి నోట కరుచుకుని నదిలోకి వెళ్లిపోయింది. ఈ ఘటన కర్నాటక రాష్ట్రంలోని రాయచూరు తాలూకాలోని కృష్ణానదిలో జరిగింది. మృతుడిని ఈ తాలూకాలోని నడిగడ్డు గ్రామమైన కొర్వకులకు చెందిన బాలుడుగా గుర్తించారు.

నవీన్ (9) అనే బాలుడు ఆదివారం తన తల్లిదండ్రులతో కలిసి నదీ తీరంలో ఉన్న పొలం వద్దకెళ్లాడు. తాగునీటి కోసం మరో బాలుడితో కలిసి నదిలోకి వెళ్లి బాటిల్‌లో నీరు నింపుకొంటుండగా మొసలి.. నవీన్‌ను నోట కరచుకుని వెళ్లింది. ఈ భయానక దృశ్యాన్ని చూసిన మరో బాలుడు రోదిస్తూ విషయాన్ని పెద్దలకు చెప్పాడు.

గ్రామస్థులు నది వద్దకెళ్లి చూడగా నవీన్ జాడ కనిపించలేదు. సమాచారం అందుకున్న పోలీసులు.. అగ్నిమాపక సిబ్బందితో కలిసి బాలుడి ఆచూకీ కోసం గాలించినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. రాత్రి వరకు బాలుడి జాడ కానరాలేదు. దీనిపై స్థానిక పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

విడుదలకు సిద్దమైన రాజేంద్ర ప్రసాద్, అర్చన చిత్రం షష్టి పూర్తి

పదవిలో ఉన్నవారు బూతులు మాట్లాడితే పవర్ కోల్పోవాలి : గడ్డం రమణారెడ్డి

Pawan Kalyan:, హరిహరవీరమల్లు షూటింగ్ పూర్తి చేసిన పవన్ కళ్యాణ్

మ్యాచ్ గెలిచిన విజయ్ దేవరకొండ - కింగ్డమ్ సాంగ్ రీల్ చేయాలంటూ రిక్వెస్ట్

వారం రోజులుగా నిద్రలేని రాత్రులే గడుపుతున్నా : సమంత

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

వేసవికాలం: కడుపుకు అమృతం.. చద్దన్నం తింటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

వేసవిలో మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఆరోగ్యకరమైన పానీయాలు ఇవే

తర్వాతి కథనం
Show comments