Webdunia - Bharat's app for daily news and videos

Install App

పంజాబ్ స్టేట్ ఇంటెలిజెన్స్ హెడ్‌క్వార్టర్‌పై గ్రనేడ్‌తో దాడి..

Webdunia
మంగళవారం, 10 మే 2022 (09:14 IST)
పంజాబ్ రాష్ట్రంలో ఆమ్ ఆద్మీ పాలన సాగుతోంది. అయితే, గత కొన్ని రోజులుగా ఈ రాష్ట్రంలో శాంతిభద్రతలకు విఘాతం కలిగినట్టు తెలుస్తోంది. నిషేధిత ఖలిస్తాన్ తీవ్రవాద సంస్థ ఆగడాలు హెచ్చరుమీరిపోతున్నాయి. ఈ క్రమంలో తాజాగా ఆ రాష్ట్ర నిఘా విభాగం ప్రధాన కార్యాలయంపై రాకెట్ ఆధారిత గ్రనేడ్ దాడి జరిగింది. ఈ గ్రనేడ్‌ను డ్రోన్ ద్వారా ఇద్దరు వ్యక్తులు ప్రయోగించినట్టు అనుమానిస్తున్నారు. 
 
స్టేట్ ఇంటెలిజెన్స్ హెడ్ క్వార్టర్ కార్యాలయంలోని ఓ భవనాన్ని లక్ష్యంగా చేసుకుని ఈ రాకెట్ ఆధారిత గ్రనేడ్ దాడి చేసినట్టు తెలుస్తోంది. ఈ దాడితో అప్రమత్తమైనద పోలీసులు పరిస ప్రాంతాల్లో అనుమానిత వ్యక్తులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. 
 
అయితే, ఈ దాడిపై పంజాబ్ పోలీసు ఉన్నతాధికారులు స్పందించారు. ఇదేమీ ఉగ్రదాడి కాదన్నారు. పేలుడు మాత్రమేనని చెప్పారు. దాడి కారణంగా కార్యాలయంలోని మూడో అంతస్తులో కొన్ని కిటికీలు దెబ్బతిన్నాయని, ఈ ఘటనపై సమగ్ర విచారణ జరిపి నివేదిక ఇవ్వాలని ముఖ్యమంత్రి భగత్ సింగ్ మాన్ ఉన్నాతధికారులను ఆదేశించారు. అలాగే, జాతీయ దర్యాప్తు సంస్థ కూడా రంగంలోకి దిగి విచారణ జరుపుతోంది. 

సంబంధిత వార్తలు

వీరభద్ర స్వామి ఆలయానికి జూనియర్ ఎన్టీఆర్ గుప్త విరాళం

అల్లు అర్జున్ ఆర్మీ అంత పనిచేసింది.. నాగబాబు ట్విట్టర్ డియాక్టివేట్

రెండు వారాల పాటు థియేటర్లు మూసివేత.. కారణం ఇదే

రాజు యాదవ్‌ చిత్రం ఏపీ, తెలంగాణలో విడుదల చేస్తున్నాం : బన్నీ వాస్

ఫిలింఛాబర్ వర్సెస్ ఎగ్జిబిటర్లు - థియేటర్ల మూసివేతపై ఎవరిదారి వారిదే

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

తర్వాతి కథనం
Show comments