Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్లేటులో దూబే కాళ్లు కడిగి.. ఆ నీటి తాగి తలపై చల్లుకున్నాడు..

బీజేపీ నేతల నోటి దురుసుతో వివాదాలు కొనితెచ్చుకుంటున్న సంగతి తెలిసిందే. తాజాగా జార్ఖండ్‌కు చెందిన ఓ బీజేపీ ఎంపీపై నెటిజన్లు మండిపడుతున్నారు. గొడ్డా పార్లమెంట్ నియోజక వర్గ ఎంపీ నిశికాంత్ దుబే ఆదివారం ఓ

Webdunia
సోమవారం, 17 సెప్టెంబరు 2018 (15:55 IST)
బీజేపీ నేతల నోటి దురుసుతో వివాదాలు కొనితెచ్చుకుంటున్న సంగతి తెలిసిందే. తాజాగా జార్ఖండ్‌కు చెందిన ఓ బీజేపీ ఎంపీపై నెటిజన్లు మండిపడుతున్నారు. గొడ్డా పార్లమెంట్ నియోజక వర్గ ఎంపీ నిశికాంత్ దుబే ఆదివారం ఓ ప్రాజెక్టు ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రసంగానికి అనంతం పవన్ అనే బీజేపీ కార్యకర్త ఓ ప్లేటు, లోటాలో నీళ్లు తీసుకుని ఎంపీ కాళ్ల వద్ద కూర్చున్నాడు. 
 
ప్లేటులో దూబే కాళ్లు కడిగి, తువాలుతో పాదాలు శుభ్రంగా తుడిచాడు. పాదాలు కడిగిన నీటిని తాగి తలపై చల్లుకున్నాడు. ఈ సందర్భంగా అక్కడున్న వారంతా ''పవన్ భాయ్ జిందాబాద్'' అని నినాదాలు కూడా చేశారు. దీనికి సంబంధించి వీడియోను నిశికాంత్‌ తన ఫేస్‌బుక్‌ అకౌంట్‌లో పోస్ట్‌ చేశారు. ఈ వీడియోపై నెటిజన్లు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. 
 
ఓ ఎంపీ అయివుండి ఓ కార్యకర్తతో అలా చేయించడం ఏమిటని ఫైర్ అవుతున్నారు. కాళ్లు కడిగిన నీళ్లు తాగుతుంటే ఏం చేస్తున్నావంటూ నిప్పులు చెరిగారు. ఓ కార్యకర్త తెలిసో తెలియకో అలా చేస్తే, సర్ధి చెప్పాల్సింది పోయి, ఆ వీడియోను సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేస్తారా అంటూ నెటిజన్లు ఫైర్‌ అయ్యారు. దీంతో వెంటనే తన ఫేస్‌బుక్‌ అకౌంట్‌ నుంచి ఆ వీడియోను నిశికాంత్‌ తొలగించారు.

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments