Webdunia - Bharat's app for daily news and videos

Install App

శ్రీదేవిది హత్యే.. బాత్‌టబ్‌లో మునిగి చనిపోవడం అసాధ్యం: సుబ్రహ్మణ్య స్వామి

ప్రముఖ సినీ నటి శ్రీదేవి మృతిపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో.. సంచలన వ్యాఖ్యలు చేయడంలో ఎప్పుడు ముందుండే బీజేపీ సీనియర్ నేత సుబ్రహ్మణ్య స్వామి.. శ్రీదేవిది హత్యేనని వివాదాస్పద వ్యాఖ్యలు చేశార

Webdunia
మంగళవారం, 27 ఫిబ్రవరి 2018 (11:45 IST)
ప్రముఖ సినీ నటి శ్రీదేవి మృతిపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో.. సంచలన వ్యాఖ్యలు చేయడంలో ఎప్పుడు ముందుండే బీజేపీ సీనియర్ నేత సుబ్రహ్మణ్య స్వామి.. శ్రీదేవిది హత్యేనని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. అయితే శ్రీదేవిది హత్యేనని తాను చేసిన కామెంట్లు తన అభిప్రాయమేనని స్పష్టం చేశారు. 
 
అంతేకాదు.. శ్రీదేవికి మద్యం సేవించే అలవాటు లేదంటూ ఫోరెన్సిక్ రిపోర్టులో వెల్లడి కావడంపై స్వామి అనుమానం వ్యక్తం చేశారు. ఈ వ్యవహారంలో సీసీటీవీ ఫుటేజి ఏమైందని స్వామి ప్రశ్నించారు. ఇదంతా చూస్తే శ్రీదేవి హత్యకు గురయ్యే వుంటుందని అభిప్రాయం వ్యక్తం చేశారు. బాత్ టబ్‌లో శ్రీదేవి మరణించడం అనేది సిల్లీగా వుందని.. బాత్ టబ్‌లో గట్టిగా తోసేస్తే కానీ మృతి చెందే అవకాశం లేదని స్వామి వ్యాఖ్యానించారు. 
 
ఈ కేసులో ప్రాసిక్యూషన్‌ విషయాలను ప్రకటించే వరకు వేచివుండాల్సిన అవసరం వుందని స్వామి వ్యాఖ్యానించారు. కాగా శ్రీదేవి గుండెపోటుతో మరణించినట్లు వార్తలు వచ్చాయి. కానీ దుబాయ్ ఫోరెన్సిక్ రిపోర్ట్ మాత్రం శ్రీదేవి ప్రమాదవశాత్తు బాత్‌ టబ్‌లో మునిగి చనిపోయిందని చెప్తోంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sekhar Kammula: సరస్వతి దేవి తల ఎత్తుకొని చూసే సినిమా కుబేర : శేఖర్ కమ్ముల

రవితేజ, రిచా గంగోపాధ్యాయ్ బ్లాక్ బస్టర్ మిరపకాయ్ రీ రిలీజ్

ఫ్యామిలీ ఫెయిల్యూర్ స్టోరీ నేపథ్యంగా స:కుటుంబానాం చిత్రం

థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతున్న స్కై మూవీ

గడపగడపకు ఆర్కే నాయుడు నుంచి విక్రాంత్ ఐపీఎస్ గా మారా : ఆర్‌కె సాగర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శరీరానికి శక్తినిచ్చే బాదం, రాగి మాల్ట్‌ ఇలా చేయాలి

ఈ పండ్లు తింటే శరీరానికి కావలసినంత ప్రోటీన్

మిట్రల్ రెగర్జిటేషన్ చికిత్స: దేశంలో ట్రాన్స్‌కాథెటర్-ఎడ్జ్-టు-ఎడ్జ్ రిపేర్ సిస్టం మైక్లిప్‌ను ప్రారంభించిన మెరిల్

మలాసనం వేసి గోరువెచ్చని మంచినీళ్లు తాగితే?

బిస్కెట్లు తింటే ఆకలి తీరుతుందేమో కానీ...

తర్వాతి కథనం
Show comments