Webdunia - Bharat's app for daily news and videos

Install App

కరోనా వైరస్ సోకి బీజేపీ రాజ్యసభ సభ్యుడు మృతి

Webdunia
గురువారం, 17 సెప్టెంబరు 2020 (17:19 IST)
కరోనా వైరస్ దెబ్బకు మనుషులు పిట్టల్లా రాలిపోతున్నారు. నిన్నటికి నిన్న తిరుపతి ఎంపీ బల్లి దుర్గా ప్రసాద్ కన్నుమూశారు. ఈయన ప్రస్తుత లోక్‌సభలో తిరుపతి నుంచి ప్రాతినిథ్యం వహిస్తున్నారు. ఈ విషాదకర ఘటనను మరిచిపోకముందే... ఇపుడు బీజేపీకి చెందిన రాజ్యసభ సభ్యుడు అశోక్ గస్తీ మృతి చెందారు. 
 
55 ఏళ్ల అశోక్ బెంగళూరులో కరోనాకు చికిత్స పొందుతూ ఆసుపత్రిలోనే తుదిశ్వాస విడిచారు. ఇటీవల కోవిడ్ టెస్టులు నిర్వహించడంతో కరోనా పాజిటివ్ అని తేలింది. దీంతో ఈ నెల 2న బెంగళూరులోని మణిపాల్ ఆసుపత్రిలో చేరారు. ఆరోగ్యం పూర్తిగా క్షీణించడంతో ఈరోజు  ప్రాణాలు కోల్పోయారు.
 
అశోక్ గస్తీ తొలిసారి రాజ్యసభ సభ్యుడిగా ఎన్నికయ్యారు. విద్యార్థి దశ నుంచి ఆయన ఆరెస్సెస్‌లో ఉన్నారు. ఆ తర్వాత 18 ఏళ్ల వయసులో బీజేపీలో చేరారు. ఆ తర్వాత  అంచెలంచెలుగా ఎదుగుతూ రాజ్యసభ సభ్యుడి వరకు ఎదిగారు. అశోక్ గస్తీ మరణం పట్ల ఆ పార్టీ నేతలు దిగ్భ్రాంతిని వ్యక్తం చేస్తున్నారు. ఒక మంచి నేతను కోల్పోయామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Prabhas: ప్రభాస్, మారుతీ, థమన్ నవ్వులోంచి రాజా సాబ్ టీజర్ రాబోతుంది

తెలంగాణ గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డ్స్‌ వేడుకను విజయంవంతం చేయాలి :దిల్‌ రాజు

Raghu kunche: గేదెలరాజు కాకినాడ తాలూకా చిత్రంలో రఘుకుంచే లుక్‌

Kavya Kalyan Ram: గ్లామ‌ర‌స్ చిత్రాలలో నటించేందుకు సిద్ధమైన కావ్య క‌ళ్యాణ్ రామ్‌

కంటెంట్ ఈజ్ కింగ్ అని వైల్డ్ బ్రీత్ సినిమా ప్రూవ్ చేస్తుంది - శివాజీ రాజా

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

టీలో కల్తీని ఎలా కనుగొనాలి? ప్రతి వినియోగదారుడు తప్పనిసరిగా తెలుసుకోవలసినది

కొలెస్ట్రాల్ వెన్నలా కరిగిపోవాలంటే ఇది తాగాల్సిందే

How to Use Hair Oil: మహిళలు జుట్టుకు నూనె ఎలా రాసుకోవాలో తెలుసా?

సబ్జా సీడ్స్ లెమన్ వాటర్ అద్భుత ప్రయోజనాలు

లివర్ సమస్యలను పోగొట్టే తేనెలో ఊరబెట్టిన ఉసిరికాయలు

తర్వాతి కథనం
Show comments