Webdunia - Bharat's app for daily news and videos

Install App

గోమాత కోసం చంపడానికైనా, చావడానికైనా సిద్ధం: సాక్షి మహారాజ్

Webdunia
మంగళవారం, 6 అక్టోబరు 2015 (14:47 IST)
గోమాత అయిన ఆవును కాపాడుకునేందుకు తాము ఎవరినైనా చంపడానికైనా, చావడానికైనా సిద్ధమని బీజేపీ ఎంపీ సాత్రి మహారాజ్ ప్రకటించారు. గోమాతను ఎవరైనా చంపాలని చూస్తే తాము వూరుకోమని స్పష్టం చేశారు.

ఆవు మాంసం భుజించాడనే ఆరోపణలతో యూపీలో ఓ ముస్లిం వ్యక్తిని దారుణంగా కొట్టి చంపేసిన ఘటన వివాదాస్పదమైన నేపథ్యంలో సాక్షి మహారాజ్ వ్యాఖ్యలు దుమారం రేపేలా ఉన్నాయి. అలాగే పనిలో పనిగా సాక్షి మహారాజ్ సమాజ్ వాదీ పార్టీ సీనియర్ నేత అజంఖాన్‌పై తీవ్ర విమర్శలు చేశారు. అజం ఖాన్ పాకిస్థాన్‌కు చెందిన వాడని, మరణించిన వ్యక్తి కుటుంబానికి యూపీ సీఎం ఆర్థిక సాయం ప్రకటించడంపై సాక్షి మహారాజ్ తప్పుబట్టారు. 
 
ఇదిలా ఉంటే.. నిషేధిత జంతు మాంసం తీసుకున్నాడనే అనుమానంతోనే మహమ్మద్ అక్లఖ్ అనే 52 ఏళ్ల వ్యక్తి చనిపోవడానికి కారణమైందని ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం నివేదికలో పేర్కొంది. యూపీలోని దాద్రీకి దగ్గరలోని ఓ గ్రామానికి చెందిన అక్లఖ్‌ను పశుమాంసం తిన్నాడనే అనుమానంతో గ్రామస్థులు కొట్టి చంపిన ఘటనపై ఆ రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి నివేదిక అందజేసింది. అయితే నివేదికలో ఎక్కడా 'బీఫ్' అనే పదం వాడలేదు. ఈ ఘటన దేశవ్యాప్తంగా సంచలనమైన సంగతి తెలిసిందే.

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

Show comments