Webdunia - Bharat's app for daily news and videos

Install App

వందే భారత్ రైలుకు జెండా ఊపుతూ ట్రాక్‌పై పడిపోయిన బీజేపీ ఎమ్మెల్యే!! (Video)

ఠాగూర్
మంగళవారం, 17 సెప్టెంబరు 2024 (13:09 IST)
వందే భారత్ రైలుకు జెండా ఊపుతూ స్వాగతం పలుకుతున్న ఒక మహిళా ఎమ్మెల్యే ఒకరు అదుపుతప్పి ఫ్లాట్‌ఫామ్ నుంచి రైలు పట్టాలపై పడిపోయారు. అయితే, అదృష్టవశాత్తు ఆమెకు ఎలాంటి గాయాలు కాలేదు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ఇటావా రైల్వే స్టేషన్‌లో చోటుచేసుకుంది. 
 
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ వర్చువల్‌గా ప్రారంభించిన వందే భారత్ రైలు ఆగ్రా నుంచి వారణాసికి వస్తున్న రైలుకు అనేక మంది బీజేపీ నేతలు ఇటావా రైల్వే స్టేషన్‌లో స్వాగతం పలికారు. ఈ కార్యక్రమానికి అనేక మంది బీజేపీ కార్యర్తలు స్టేషన్‌‍కు తరలివచ్చారు. దీంతో రైల్వేస్టేషన్‌తో పాటు ఫ్లాట్‌ఫామ్ కూడా కిక్కిరిసిపోయింది. ఈ క్రమంలో ఇటావా సర్దార్ ఎమ్మెల్యే సరితా భదౌరియా అదుపుతప్పి ఒక్కసారిగా కిందపడిపోయారు. ఇందుకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. 
 
ఫ్లాట్‌ఫాంలోకి వస్తున్న రైలుకు స్వాగతం చెప్పేందుకు స్టేషన్‌కు స్థానికులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. దీంతో రైల్వే స్టేషన్ కిక్కిరిసిపోయింది. ఒకానొక సమయంలో పరిస్థితి అదుపుతప్పేలా కనిపించింది. ఈ క్రమంలోనే తోపులాటు చోటుచేసుకోవడంతో  ఎమ్మెల్యే కిందపడిపోయారు. ఆ తర్వాత ఇతర నేతలు ఆమెను పైకి లేవనెత్తారు. పెద్దగా గాయాలు కాకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. స్టేషన్ కిక్కికిరిసిపోయాలా జనాన్ని అనుమతించడంపై తీవ్రస్థాయిలో విమర్శలు వస్తున్నాయి. 


 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'కన్నప్ప' చిత్రాన్ని వీక్షించిన రజనీకాంత్

అర్జున్, జగపతి బాబు, వేణు ఎంటర్‌టైనర్ హనుమాన్ జంక్షన్ రీ-రిలీజ్

Ravi Teja: రవితేజ, కిషోర్ తిరుమల సినిమా హైదరాబాద్‌లో రెగ్యులర్ షూటింగ్

Rajinikanth: కన్నప్ప సినిమాను చూసి ఆశీర్వదించిన రజనీకాంత్

Nag Ashwin : సుహాస్, శివాని నగరం కాంబినేషన్ లో సినిమాకు నాగ్ అశ్విన్ క్లాప్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తాటి కల్లు ఆరోగ్య ప్రయోజనాలు

Night shifts: నైట్ షిఫ్ట్ చేస్తున్న మహిళలకు ఆస్తమా వచ్చే ప్రమాదం ఎక్కువ

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?

జామ ఆకుల టీ తాగితే?

ఇది షాకింగ్ వార్తే.. ఆల్కహాల్‌ కాలేయ వ్యాధులు.. మృతుల్లో మహిళలే ఎక్కువ

తర్వాతి కథనం
Show comments