వందే భారత్ రైలుకు జెండా ఊపుతూ ట్రాక్‌పై పడిపోయిన బీజేపీ ఎమ్మెల్యే!! (Video)

ఠాగూర్
మంగళవారం, 17 సెప్టెంబరు 2024 (13:09 IST)
వందే భారత్ రైలుకు జెండా ఊపుతూ స్వాగతం పలుకుతున్న ఒక మహిళా ఎమ్మెల్యే ఒకరు అదుపుతప్పి ఫ్లాట్‌ఫామ్ నుంచి రైలు పట్టాలపై పడిపోయారు. అయితే, అదృష్టవశాత్తు ఆమెకు ఎలాంటి గాయాలు కాలేదు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ఇటావా రైల్వే స్టేషన్‌లో చోటుచేసుకుంది. 
 
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ వర్చువల్‌గా ప్రారంభించిన వందే భారత్ రైలు ఆగ్రా నుంచి వారణాసికి వస్తున్న రైలుకు అనేక మంది బీజేపీ నేతలు ఇటావా రైల్వే స్టేషన్‌లో స్వాగతం పలికారు. ఈ కార్యక్రమానికి అనేక మంది బీజేపీ కార్యర్తలు స్టేషన్‌‍కు తరలివచ్చారు. దీంతో రైల్వేస్టేషన్‌తో పాటు ఫ్లాట్‌ఫామ్ కూడా కిక్కిరిసిపోయింది. ఈ క్రమంలో ఇటావా సర్దార్ ఎమ్మెల్యే సరితా భదౌరియా అదుపుతప్పి ఒక్కసారిగా కిందపడిపోయారు. ఇందుకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. 
 
ఫ్లాట్‌ఫాంలోకి వస్తున్న రైలుకు స్వాగతం చెప్పేందుకు స్టేషన్‌కు స్థానికులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. దీంతో రైల్వే స్టేషన్ కిక్కిరిసిపోయింది. ఒకానొక సమయంలో పరిస్థితి అదుపుతప్పేలా కనిపించింది. ఈ క్రమంలోనే తోపులాటు చోటుచేసుకోవడంతో  ఎమ్మెల్యే కిందపడిపోయారు. ఆ తర్వాత ఇతర నేతలు ఆమెను పైకి లేవనెత్తారు. పెద్దగా గాయాలు కాకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. స్టేషన్ కిక్కికిరిసిపోయాలా జనాన్ని అనుమతించడంపై తీవ్రస్థాయిలో విమర్శలు వస్తున్నాయి. 


 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మహిళల శరీరాకృతి ఎపుడూ ఒకేలా ఉండదు : మిల్కీ బ్యూటీ

కోలీవుడ్ హీరో అజిత్ ఇంటికి బాంబు బెదిరింపు

అలాంటి పాత్రలు వస్తే మొహమాటం లేకుండా నో చెప్పేస్తా : మీనాక్షి చౌదరి

హాలీవుడ్ లో మూవీస్ హీరో హీరోయిన్ విలన్ ఇలా విభజన ఉండదు : అను ఇమ్మాన్యుయేల్

నిషేధిత బెట్టింగ్ యాప్‌లకు ప్రచారం : సిట్ ముందుకు విజయ్ దేవరకొండ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రోజుకి ఒక్క జామకాయ తింటే చాలు...

బ్లెండర్స్ ప్రైడ్ ఫ్యాషన్ టూర్ సిద్ధం చేసింది ఫ్యాషన్ ముందడుగు

శరీరంలో కొలెస్ట్రాల్ పేరుకుపోతే ఎలాంటి లక్షణాలు కనబడతాయి?

రక్తలేమితో బాధపడేవారికి ఖర్జూరాలతో కౌంట్ పెరుగుతుంది

ప్రపంచ మధుమేహ దినోత్సవం: రక్తంలో చక్కెర స్థాయిలను నిర్వహించడానికి కాలిఫోర్నియా బాదంపప్పులు

తర్వాతి కథనం
Show comments