Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆన్‌లైన్ ద్వారా పాకిస్థాన్ అమ్మాయితో బీజేపీ నేత నిఖా

ఠాగూర్
మంగళవారం, 22 అక్టోబరు 2024 (15:29 IST)
పాకిస్థానీయులను బద్ధ శత్రువులుగా భారతీయ జనతా పార్టీ నేతలు పరిగణిస్తారు. అలాంటి నేతల్లో ఒక నేత కుమారుడు పాకిస్తాన్ అమ్మాయిని వివాహం చేసుకోనున్నాడు. ఆ అమ్మాయిని ఆన్‌లైన్ ద్వారా నిఖా చేసుకున్నారు. ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి చెందిన జౌన్పూర్ జిల్లాకుచెందిన బీజేపీ కార్పొరేటర్ తహసీన్ షాహిద్ కుమారుడు మహ్మద్ అబ్బాద్ హైదర్ పాకిస్థాన్‌లోని లాహోర్‌కు చెందిన అంగ్లీష్ జహ్రాను వివాహమాడనున్నారు. 
 
ఇరు దేశాల మధ్య కొనసాగుతున్న దౌత్య వివాదాల కారణంగా వరుడు షాహిద్ వీసా కోసం దరఖాస్తు చేసుకున్నా దక్కలేదు. దానికితోడు వధువు తల్లి యాస్మిన్ జైదీ అనారోగ్యంతో ఐసీయులో చేరడం పెళ్లికి మరింత ఆటంకాలుగా మారాయి. దీంతో పెళ్లి వేడుకను ఆన్‌లైనులో నిర్వహించాలని షాహిద్ నిర్ణయించుకున్నాడు. పెళ్లి కూతురు తరపువారు కూడా అంగీకారం తెలపడంతో ఆన్‌లైనులోనే పెళ్లి తంతుని ముగించారు. 
 
గత శుక్రవారం రాత్రి ఆన్‌లైనులో నిఖా పూర్తి చేసుకున్నారు. ఇక్కడి నుంచి షాహిద్ కుటుంబ సభ్యులు, లాహోర్ నుంచి వధువు కుటుంబం ఈ వేడుకలో పాల్గొన్నారు. ఈ వివాహంపై షియా మత పెద్ద మౌలానా మహఫూజుల్ హసన్ ఖాన్ స్పందించారు. ఇస్లాంలో నిఖాకు స్త్రీ అంగీకారం చాలా ముఖ్యమని, తన సమ్మతిని ఆమె మౌలానాకు తెలియజేస్తుందని చెప్పారు. ఇరువైపుల మౌలానాలు కలిసి వేడుకను నిర్వహించగలిగినప్పుడు ఆన్‌లైనులో నిఖా సాధ్యమవుతుందని ఆయన వివరించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

హోంబాలే ఫిల్మ్స్ మహావతార్ నరసింహ హిరణ్యకశిపు ప్రోమో రిలీజ్

పాకీజాకు పవన్ అండ... పవర్ స్టార్ కాళ్ళు మొక్కుతానంటూ వాసుకి భావోద్వేగం

పోలీస్ వారి హెచ్చరిక లోని పాటకు పచ్చజెండా ఊపిన ఎర్రక్షరాల పరుచూరి

Pawan: పవన్ కళ్యాణ్ సాయంతో భావోద్వేగానికి లోనయిన నటి వాసుకి (పాకీజా)

Ranbir Kapoor: నమిత్ మల్హోత్రా రామాయణం తాజా అప్ డేట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మిరప కారం చేసే మేలు ఎంతో తెలుసా?

నిద్రకు 3 గంటల ముందే రాత్రి భోజనం ముగించేస్తే ఏం జరుగుతుంది?

పరగడుపున తినకూడని 8 పండ్లు

కొలెస్ట్రాల్‌ను నియంత్రించుకోవడానికి సహాయపడే 4 ఆహారాలు

గ్రీన్ టీ అతిగా తాగుతున్నారా?

తర్వాతి కథనం
Show comments