Webdunia - Bharat's app for daily news and videos

Install App

అశ్వానికి కాషాయం రంగు : బీజేపీపై మేనకా గాంధీ సంస్థ ఫిర్యాదు

Webdunia
శుక్రవారం, 20 ఆగస్టు 2021 (17:06 IST)
భారతీయ జనతా పార్టీ ప్రజలకు మరింత చేరువయ్యేందుకు ప్రణాళిక రూపొందించింది. ఇందుకోసం జన్ ఆశీర్వాద్ పేరుతో దేశ వ్యాప్త యాత్రలకు శ్రీకారం చుట్టనుంది. పార్లమెంటు వర్షాకాల సమావేశాలు ముగిసిన తర్వాత ఈ యాత్ర ప్రారంభంకానుంది. 
 
ముఖ్యంగా, ప్రధాని నరేంద్ర మోడీ కొత్తగా చేపట్టిన మంత్రివర్గ విస్తరణలో మంత్రి పదవులు దక్కించుకున్నవారు, ప్రమోషన్లు పొందినవారు ఈ యాత్ర ద్వారా ప్రజలతో మమేకమయ్యేందుకు ప్రయత్నిస్తున్నారు. 
 
కాగా, మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని ఇండోర్‌లో జన ఆశీర్వాద యాత్ర సందర్భంగా ఓ గుర్రానికి బీజేపీ జెండా రంగులు వేశారు. కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింథియా నిర్వహించిన ఈ యాత్రలో గుర్రం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.
 
అయితే, కేంద్ర మాజీ మంత్రి మేనకా గాంధీకి చెందిన పీపుల్ ఫర్ యానిమల్స్ (పీఎఫ్ఏ) స్వచ్ఛంద సేవా సంస్థ ప్రతినిధులు ఈ ఘటనను తీవ్రంగా పరిగణించారు. 
 
ఇది ఖచ్చితంగా జంతువులను హింసించడం కిందికే వస్తుందని భావిస్తూ వారు ఇండోర్‌లోని సంయోగితా గంజ్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఈ అంశాన్ని ఎన్నికల సంఘం దృష్టికి కూడా తీసుకెళ్లాలని వారు నిర్ణయించారు. 
 
కాగా, గతంలో మేనకా గాంధీ ప్రధాని మోడీ సారథ్యంలోని ఎన్డీయే ప్రభుత్వం-1 మంత్రివర్గంలో కేంద్ర మంత్రిగా పని చేసిన విషయం తెల్సిందే. ఆమె కుమారుడు వరుణ్ గాంధీ బీజేపీలో కొనసాగుతున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Dil Raju: సినిమాల్లో రాణించాలంటే ఈజీ కాదు; ఔత్సాహికులు ఆలోచించుకోవాలి : దిల్ రాజు

డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా లాంచ్ చేసిన జిగ్రీస్ క్రేజీ లుక్

వారిపై పరువునష్టం దావా వేశాం: జీ5 తెలుగు హెడ్ అనురాధ

Nani: నేచురల్ స్టార్ నాని చిత్రం ది పారడైజ్ సెట్లోకి ఎంట్రీ

Mohan babu: భగవంతుడి ఆజ్ఞతోనే కన్నప్ప విజయం దక్కింది : డా. ఎం. మోహన్ బాబు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పరగడుపున తినకూడని 8 పండ్లు

కొలెస్ట్రాల్‌ను నియంత్రించుకోవడానికి సహాయపడే 4 ఆహారాలు

గ్రీన్ టీ అతిగా తాగుతున్నారా?

ఫ్యాబ్ ఇండియా బ్యూటిఫుల్ ఇంపెర్ఫెక్షన్ ప్రచారం హస్తకళల ఆకర్షణ

డయాబెటిస్, ఏముందిలే ఇవి తినేద్దాం అనుకోరాదు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments