Webdunia - Bharat's app for daily news and videos

Install App

మహిళ మృతదేహాన్ని బైకుపై తరలించారు.. ఎందుకని... ఎక్కడ?

Webdunia
మంగళవారం, 31 మే 2016 (15:26 IST)
మనిషి బతికున్నప్పుడు గౌరవించని మనుషులు చనిపోయాక మృతదేహం పట్ల మర్యాద పాటిస్తారు. దహనసంస్కారాలు చేసేవరకు మృత‌దేహాన్ని సంప్ర‌దాయానుబద్దంగా ఒక చోటి నుంచి మ‌రోచోటుకి త‌ర‌లించ‌డం భార‌తీయ ఆచారం. అలాంటిది ఇద్దరు యువకులు చనిపోయిన మహిళ మృతదేహాన్నిఆటబొమ్మలా బైక్‌పై తీసుకొని వెళ్లడం కలకలం రేపింది. ఈ దారుణ ఘటన ఒడిశా రాజ‌ధాని భువనేశ్వర్‌లో చోటుచేసుకుంది. 
 
దీని పూర్తి వివరాలను.. పరిశీలిస్తే భారాముండా గ్రామంలో ఓ మహిళ ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. పోస్ట్‌మార్టం నిర్వహించిన అనంతరం ప్లాస్టిక్ కవర్‌లో ప్యాక్ చేసి ఉన్న ఆ మృతదేహాన్నిఇద్దరు యువకులు బైక్  వెనకాల కట్టుకుని తీసుకెళుతున్న వైనం అందరిని భ్రమింపజేశాయి. మృతదేహాన్ని తరలించేందుకు, వాహనం అందుబాటులో లేక ఇలా చేశారా... లేక ఇతర కారణాలేమన్నా ఉన్నాయాని అనుమానాలు వ్య‌క్తమ‌వుతున్నాయి. 
 
ఈ ఘటనపై స్పందించిన జిల్లా కలెక్టర్ రష్మిత్ పాండా... ఆ చుట్టుపక్కల 20 కి.మీ పరిధిలో రెండు వాహనాలు అందుబాటులో ఉంచామని వెల్లడించారు. మృతదేహాలను తరలించేందుకు పేదల కోసం వీటిని అందుబాటులో ఉంచామని తెలిపారు. గతంలో కూడా ఇలాంటి సంఘటనే బరంగపూర్ జిల్లాలో జరిగింది. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మా తాతగారు రసికుడు.. మెగాస్టార్ కామెంట్స్.. పవన్‌ పైన వైసిపి ట్రోల్స్

కన్నడ హీరో యష్‌తో కియారా అద్వానీకి కలిసి వస్తుందా?!!

సామాన్య వ్యక్తిలా మెగాస్టార్ చిరంజీవి వ్యాఖ్యలు: జాతీయ మీడియాల్లో వక్ర చర్చలు

నా కథల ఎంపిక వెరైటీ గా ఉంటుంది : రానా దగ్గుబాటి

అమెజాన్ ప్రైమ్స్ లో సస్పెన్స్ థ్రిల్లర్ రాజు గారి అమ్మాయి నాయుడు గారి అబ్బాయి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

దొండ కాయలు తినేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

హైదరాబాద్ వేడి వాతావరణం, భౌగోళిక పరిస్థితులు డీహైడ్రేషన్ ప్రమాదంలో పడేస్తున్నాయి: హెచ్చరిస్తున్న నిపుణులు

బీట్ రూట్ జ్యూస్ ఉపయోగాలు

Malida Sweet: తెలంగాణ వంటకాల్లో చిరు ధాన్యాలు.. మిగిలిన చపాతీలతో మలిదలు చేస్తారు.. తెలుసా?

Garlic: వెల్లుల్లితో చుండ్రు సమస్యకు చెక్.. వెల్లుల్లిని నూనె తయారీ ఎలా?

తర్వాతి కథనం
Show comments