Webdunia - Bharat's app for daily news and videos

Install App

వివాహేతర సంబంధం పెట్టుకుందని భార్యను చంపి నీటి ట్యాంకులో వేసిన భర్త

Webdunia
సోమవారం, 6 మార్చి 2023 (17:39 IST)
ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలోని బిలాస్‌పూర్‌లో ఓ దారుణం జరిగింది. కట్టుకున్న భార్య పరాయి వ్యక్తితో అక్రమ సంబంధం పెట్టుకుందన్న కారణంతో ఓ వ్యక్తి దారుణానికి పాల్పడ్డాడు. కట్టుకున్న భార్యను హత్య చేసి ముక్కలుగా నరికి, శరీర భాగాలను ప్యాక్ చేసి నీటి ట్యాంకులో వేశాడు. బిలాస్‌పూర్‌లోని ఉస్లాపూపర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన జరిగింది. గత జనవరి 5వ తేదీన ఈ దారుణానికి పాల్పడ్డాడు. ఈ ఘాతుకానికి పాల్పడిన వ్యక్తిని పోలీసులు నకిలీ నోట్ల కేసులో అరెస్టు చేశారు. ఈ కేసును విచారిస్తుండగా భార్యను హత్య చేసిన విషయం వెలుగులోకి వచ్చింది.
 
నకిలీ నోట్ల కేసు విచారణలో భాగంగా, అతని ఇంట్లో పోలీసులు సోదాలు చేస్తుండగా వాటర్ ట్యాంకులో నుంచి దుర్వాసన వచ్చింది. దీన్ని తెరిచి చూడగా, వాటర్ ట్యాంకులో కొన్ని బ్యాగులు కనిపించాయి. వాటిని తెరిచి చూస్తే మృతదేహం ముక్కలు కనిపించడంతో షాక్‍‌కు గురయ్యారు. ఈ మృతదేహం వ్యవహారంపై అతని వద్ద పోలీసులు విచారణ జరుపగా తన భార్య మరో వ్యక్తితో అక్రమ సంబంధం పెట్టుకుందని, అందువల్ల కోపంతో ఈ హత్య చేసినట్టు అంగీకరించాడు. ఈ దంపతులకు పదేళ్ల క్రితం వివాహం కాగా, ఇద్దరు పిల్లులు కూడా ఉన్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Varun Tej : మాల్దీవుల విహారయాత్ర లో వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి

NTR: వార్ 2 కోసం డబ్బింగ్ ప్రారంభించిన మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్

Mega157 : మెగాస్టార్ చిరంజీవి, నయనతార చిత్రం షెడ్యూల్ ఈరోజు ముస్సోరీలో ప్రారంభం

సింగర్‌ మంగ్లీపై డ్రగ్స్ కేసు? త్రిపుర రిసార్ట్‌లో అర్థరాత్రి దాకా డీజే హోరు!

Rashmika : కుబేర నుంచి రష్మిక మందన్న థర్డ్ సింగల్ పీ పీ డుమ్ డుమ్ సాంగ్ రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తులసి టీ ఆరోగ్య ప్రయోజనాలు

గ్లాసెడు బీట్ రసం తాగితే కలిగే ప్రయోజనాలు

రోబోటిక్ సర్జరీలలో సరికొత్త మైలురాయి సాధించిన మెడికవర్ హాస్పిటల్స్

ఓరి వీడి లవ్ ప్రపొజల్ ఐడియా తగలెయ్య (video)

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

తర్వాతి కథనం
Show comments