Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రియుడితో కలిసివుండేందుకు సొంతిల్లు నిర్మించుకోవాలని కన్నబిడ్డ కిడ్నాప్!!

ఠాగూర్
సోమవారం, 3 మార్చి 2025 (09:44 IST)
తాను ప్రేమించిన ప్రియుడుతో కలిసి వుండేందుకు వీలుగా సొంతంగా ఓ ఇంటిని నిర్మించుకోవాలన్న దురాశతో పేగు తెంచుకుని పుట్టిన బిడ్డనే ఓ కన్నతల్లి కిడ్నాప్ చేసింది. మాతృత్వపు ప్రేమను మరిచిపోయి ఈ పాడుపనికి పాల్పడిన ఆ మహిళ ఇపుడు జైలు ఊచలు లెక్కిస్తున్నారు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
బీహార్ రాష్ట్రంలోని ఛప్రా జిల్లాకు చెందిన 13 యేళ్ల బాలుడు ఆదిత్య కుమార్ ఇటీవల కిడ్నాప్‌కు గురయ్యాడు. రూ.25 లక్షల డబ్బు ఇవ్వకపోతే బాలుడుని చంపేస్తామని బెదిరించాడు. దీంతో తల్లిదండ్రులు పోలీసులను ఆశ్రయించారు. కేసు నమోదు చేసిన పోలీసులకు... కన్నతల్లిపైనే అనుమానం వచ్చింది. దీంతో ఆమెను అదుపులోకి తీసుకుని విచారించగా అసలు విషయాన్ని వెల్లడించింది. తన కుమారుడుని కిడ్నాప్ చేసింది తానేనంటూ అంగీకరించడంతో పోలీసులు నివ్వెరపోయారు. 
 
తన ప్రియుడు నితీశ్ కుమార్‌తో కలిసి ఉండేందుకు వీలుగా సొంత ఇల్లు కట్టుకోవాలని అనుకున్నానని, అందుకు కావాల్సిన డబ్బు కోసం తాను తన కుమారుడినే కిడ్నాప్ చేయించానని బబిత పోలీసులకు ఇచ్చిన వాంగ్మూలంలో వెల్లడించారు. పైగా, ఆమె ఇచ్చిన సమాచారంతో ప్రియుడు నితీశ్ కుమార్‌ను కూడా అరెస్టు చేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'కన్నప్ప' చిత్రాన్ని వీక్షించిన రజనీకాంత్

అర్జున్, జగపతి బాబు, వేణు ఎంటర్‌టైనర్ హనుమాన్ జంక్షన్ రీ-రిలీజ్

Ravi Teja: రవితేజ, కిషోర్ తిరుమల సినిమా హైదరాబాద్‌లో రెగ్యులర్ షూటింగ్

Rajinikanth: కన్నప్ప సినిమాను చూసి ఆశీర్వదించిన రజనీకాంత్

Nag Ashwin : సుహాస్, శివాని నగరం కాంబినేషన్ లో సినిమాకు నాగ్ అశ్విన్ క్లాప్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తాటి కల్లు ఆరోగ్య ప్రయోజనాలు

Night shifts: నైట్ షిఫ్ట్ చేస్తున్న మహిళలకు ఆస్తమా వచ్చే ప్రమాదం ఎక్కువ

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?

జామ ఆకుల టీ తాగితే?

ఇది షాకింగ్ వార్తే.. ఆల్కహాల్‌ కాలేయ వ్యాధులు.. మృతుల్లో మహిళలే ఎక్కువ

తర్వాతి కథనం
Show comments