Webdunia - Bharat's app for daily news and videos

Install App

మేనమామ కూతురిపై అత్యాచారం.. చిన్నారి మృతి ఎక్కడ?

Webdunia
సోమవారం, 6 ఏప్రియల్ 2020 (12:47 IST)
కరోనా వైరస్ వంటి ప్రాణాంతక వ్యాధి వచ్చినా కామాంధుల్లో ఎలాంటి మార్పు రాలేదు. వయోబేధం లేకుండా మహిళలపై అత్యాచారానికి పాల్పడుతున్నారు. తాజాగా బీహార్‌లో ఎనిమిదేళ్ల బాలికను బంధువే దారుణంగా అత్యాచారం చేశాడు. ఈ ఘటనలో తీవ్ర రక్తస్రావంతో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ వచ్చిన బాధితురాలు ప్రాణాలు కోల్పోయింది.
 
వివరాల్లోకి వెళితే.. బీహార్‌లోని నలందా జిల్లాకు నోయిడా గ్రామంలో ఈ దారుణ ఘటన చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన జీతూ అనే యువకుడు నోయిడా పరిధిలోని సలార్‌పూర్‌లో తన మేనమామ ఇంటికి సమీపంలోనే కుటుంబంతో నివాసం ఉండేవాడు. తన మేనమామ కూతురైన ఎనిమిదేళ్ల బాలికపై కన్నేశాడు. 
 
పొరుగునే ఉంటూ అదను కోసం ఎదురుచూశాడు. ఎవరూ లేని సమయం చూసి మైనర్ బాలికపై అత్యాచారానికి తెగబడ్డాడు. తీవ్ర రక్తస్రావంతో బాలిక పరిస్థితి విషమంగా మారింది. చిన్నారిపై అత్యాచారం జరిగినట్లు గుర్తించిన కుటుంబ సభ్యులు ఆమెను ఆస్పత్రికి తరలించారు. 
 
కానీ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ చిన్నారి కన్నుమూసింది. సమాచారం అందుకున్న పోలీసులు నిందితుడిపై హత్య, రేప్, చిన్న పిల్లలపై లైంగిక నేరాల సెక్షన్ల కింద కేసులు నమోదు చేసి చేసి దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

గీతానంద్-మిత్రా శర్మ ప్రధాన పాత్రల్లో రొమాంటిక్ కామెడీ గా వస్తున్న వర్జిన్ బాయ్స్!

Nani: నాని, శ్రీనిధి శెట్టి లపై HIT: The 3rd Case నుంచి రొమాంటిక్ సాంగ్

శర్వానంద్, సంయుక్త లపై నారి నారి నడుమ మురారి ఫస్ట్ సింగిల్ వచ్చేసింది

NTR: ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ చిత్రం తాజా అప్ డేట్ - ఏప్రిల్ 22న సెట్స్‌లో ఎంట్రీ

కన్నప్ప రిలీజ్ డేట్ పోస్టర్‌ను విడుదల చేసిన యోగి ఆదిత్యనాథ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మెడ నొప్పితో బాధపడుతున్నారా? వేడినీటితో స్నానం.. ఈ చిట్కాలు పాటిస్తే?

భారతదేశవ్యాప్తంగా సూట్లు, షేర్వానీలపై మేడ్ ఫర్ యు, స్టిచ్డ్ ఫర్ ఫ్రీ ఆఫర్‌ను పరిచయం చేసిన అరవింద్ స్టోర్

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

ఉల్లిపాయ నూనె లేదా జ్యూస్ ఏది మంచిది?

కీరదోసను వేసవిలో ఎందుకు తినాలో తెలుసా?

తర్వాతి కథనం