Webdunia - Bharat's app for daily news and videos

Install App

బీహార్‌లో దారుణం: విద్యార్థిని హత్య.. బైకుపై వెళ్తూ చున్నీ మెడకు చుట్టి.. ఈడ్చుకెళ్లారు..!

మహిళలపై అత్యాచారాలు, హత్యలు పెచ్చరిల్లిపోతున్నాయి. తాజాగా బీహార్‌లో దారుణ ఘటన చోటుచేసుకుంది. నడిరోడ్డుపై పదో తరగతి విద్యార్థినిని పాశవికంగా హత్య చేశారు. 15 ఏళ్ల బాలికను ముగ్గురు దుండగులు తమ బైకుతో పాట

Webdunia
బుధవారం, 26 అక్టోబరు 2016 (14:55 IST)
మహిళలపై అత్యాచారాలు, హత్యలు పెచ్చరిల్లిపోతున్నాయి. తాజాగా బీహార్‌లో దారుణ ఘటన చోటుచేసుకుంది. నడిరోడ్డుపై పదో తరగతి విద్యార్థినిని పాశవికంగా హత్య చేశారు. 15 ఏళ్ల బాలికను ముగ్గురు దుండగులు తమ బైకుతో పాటు ఈడ్చుకెళ్లి దారుణంగా చంపేశారు. వివరాల్లోకి వెళితే.. బీహార్ కైముర్ జిల్లా కార్జావ్ గ్రామంలో హాటా-దుర్గావతి ప్రధాన రహదారిపై మంగళవారం ఈ దారుణ ఘటన చోటుచేసుకుంది. 
 
ఫకరాబాద్ గ్రామానికి చెందిన పదో తరగతి విద్యార్థిని తన ముగ్గురు స్నేహితురాళ్లతో కలిసి హాఫ్ ఇయర్లీ పరీక్షలు రాసేందుకు వెళ్తుండగా బైకుపై వచ్చిన ముగ్గురు దుండగులు ఆమె చున్నీ పట్టుకుని లాగారు. మెడకు చున్నీ చుట్టుకుని ఆమె కింద పడిపోయింది. ఆమెను బైకుతో 50 మీటర్ల వరకు ఈడ్చుకుపోయారు. అక్కడితో ఆగకుండా ఆమెపైనుంచి బైకు నడిపారు. తీవ్రగాయాలతో బాధితురాలు సంఘటనా స్థలంలోనే ప్రాణాలు కోల్పోయింది. 
 
బైకు గోతిలో పడి ముగ్గురు దుండగులు కిందపడ్డారు. వీరిని స్థానికులు పట్టుకోవడానికే ప్రయత్నించడంతో బైకు అక్కడే వదిలేసి పారిపోయారు. ఈ ఘటనపై మృతురాలి తండ్రి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. దర్యాప్తును వేగవంతం చేశారు.

రేపటి నుండి పుష్పపుష్ప జపం చేస్తారంటూ తాజా అప్డేట్ ఇచ్చిన సుకుమార్

విరాజ్ అశ్విన్ క్లాప్ తో ఆర్ట్ మేకర్స్ చిత్రం ప్రారంభం

ఐవీఎఫ్ ద్వారా తల్లి కాబోతోన్న మెహ్రీన్...

డీప్ ఫేక్ వీడియో కేసు.. ముంబైకి వెళ్లిన రష్మిక మందన్న.. ఎందుకో తెలుసా?

ధర్మం కోసం యుద్ధం ప్రకటించిన హరిహర వీరమల్లు - తాజా అప్ డేట్

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

స్ట్రాబెర్రీలను తింటే కిడ్నీలకు కలిగే లాభాలు ఏమిటి? నష్టాలు ఏమిటి?

చిటికెడు ఉప్పు వేసిన మంచినీరు ఉదయాన్నే తాగితే ప్రయోజనాలు ఏంటి?

తర్వాతి కథనం
Show comments