Webdunia - Bharat's app for daily news and videos

Install App

అమ్మానాన్నలతో మాట్లాడేందుకు సెల్ ‌అడిగిందనీ... గర్భిణీని భవనం నుంచి కిందికి తోసేశాడు!

బీహార్ రాష్ట్రంలో దారుణం జరిగింది. తన తల్లిదండ్రులతో మాట్లాడేందుకు సెల్‌ఫోన్ అడిగినందుకు నిండు గర్భిణీని ఆమె భర్త రెండు అంతస్తుల భవనం నుంచి కిందికి తోసేశాడో కిరాతక భర్త. ఈ ప్రమాదంలో ఆమె రెండు కాళ్లు వ

Webdunia
గురువారం, 8 జూన్ 2017 (08:55 IST)
బీహార్ రాష్ట్రంలో దారుణం జరిగింది. తన తల్లిదండ్రులతో మాట్లాడేందుకు సెల్‌ఫోన్ అడిగినందుకు నిండు గర్భిణీని ఆమె భర్త రెండు అంతస్తుల భవనం నుంచి కిందికి తోసేశాడో కిరాతక భర్త. ఈ ప్రమాదంలో ఆమె రెండు కాళ్లు విరిగిపోగా గర్భంలోని శిశువు ప్రాణాలు కోల్పోయింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే... 
 
బీహార్, దర్భంగా జిల్లాలోని మంజిహోరా గ్రామానికి చెందిన బబితాదేవి (28), ఠాకూర్ భార్యాభర్తలు. వీరిద్దరు రెండో అంతస్తులోని ఓ ఫ్లాట్‌‍లో నివశిస్తున్నారు. ఇంటి డాబాపై ఠాకూర్ ఫోన్ మాట్లాడుతుండగా, తన తల్లిదండ్రులకు పోన్ చేసుకునేందుకు ఓసారి మొబైల్ ఇవ్వాలని బబితాదేవి భర్తను అడిగింది.
 
అంతే ఒక్కసారిగా కోపోద్రిక్తుడైన ఠాకూర్ గర్భిణీ అని కూడా చూడకుండా కిందికి తోసేశాడు. ఈ ప్రమాదంలో ఆమె కాళ్లు విరిగిపోగా గర్భంలో పెరుగుతున్న ఏడు నెలల శిశువు మరణించింది. ఆమె పరిస్థితి కూడా విషమంగా ఉన్నట్టు వైద్యులు తెలిపారు. ఆపరేషన్ చేసి మృతి చెందిన శిశువును తొలగించారు. బబిత కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు ఠాకూర్‌పై పోలీసులు కేసు నమోదు చేసి భర్తను అదుపులోకి తీసుకున్నారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Prabhas: ఆదిపురుష్ తో ప్రభాస్ రాంగ్ స్టెప్ వేశాడా? ఎవరైనా వేయించారా?

666 ఆపరేషన్ డ్రీమ్ థియేటర్ చిత్రం నుండి డాలీ ధనుంజయ్ లుక్

కిరీటి రెడ్డి, శ్రీలీల పై జూనియర్ చిత్రంలో వయ్యారి సాంగ్ చిత్రీకరణ

Rana: రానా దగ్గుబాటి సమర్పణలో కొత్తపల్లిలో ఒకప్పుడు టీజర్

తమిళ డి ఎన్ ఏ చిత్రం తెలుగులో మై బేబి గా రాబోతోంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బత్తాయి రసం తాగితే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

పచ్చి టమోటాలు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

జాయింట్ పెయిన్స్ తగ్గించుకునేందుకు 7 చిట్కాలు

మహిళలు బాదం పప్పులు ఎందుకు తినాలో తెలుసా?

ప్రపంచ చర్మ ఆరోగ్య దినోత్సవం: కాలిఫోర్నియా బాదంతో చర్మం చక్కదనం

తర్వాతి కథనం
Show comments