Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏది నిజం? హెర్బల్ మైసూర్‌పాక్‌తో కరోనా చెక్? (video)

Webdunia
బుధవారం, 8 జులై 2020 (09:35 IST)
ప్రపంచం మొత్తం కరోనా వైరస్ కోరల్లో చిక్కి కొట్టుమిట్టాడుతోంది. ఈ వైరస్ అంతానికి ప్రపంచ దేశాలన్నీ పరిశోధనల్లో నిమగ్నమైవున్నాయి. ఈ క్రమంలో తమిళనాడు రాష్ట్రంలోని కోయంబత్తూరు, చిన్నియం పాళయంలోని ఓ స్వీట్ షాపు మాత్రం కొత్త ఫార్ములాతో తెరపైకి వచ్చింది. 
 
రోజు ఒకటి 'హెర్బల్ మైసూర్‌పాక్' తినడం ద్వారా కోవిడ్ నుంచి సురక్షితంగా బయటపడొచ్చని ఏకంగా బహిరంగ ప్రకటన కూడా ఇచ్చేసింది. అయితే చుట్టుపక్కల ప్రాంతాల్లో నివాసముంటున్న వారి నుంచి కూడా చాలా మంచి స్పందన కూడా వస్తోందని ఆ షాపు ప్రకటించింది. 
 
కోవిడ్ లక్షణాలున్న వారందరూ ఉచితంగా పొందవచ్చని ఆ షాపు యాజమాన్యం పేర్కొంది. ఈ ‘హెర్బల్ మైసూర్ పాక్’ ఫార్ములాను కేంద్ర ప్రభుత్వానికి ఇచ్చేందుకు కూడా తాము సిద్ధంగానే ఉన్నామని యజమానులు ప్రకటించారు కూడా. చిన్నియం పాళయం, వెల్లూరు ప్రాంతాల్లో ఈ ప్రచారం ఎంతకూ తగ్గకపోవడంతో ఆరోగ్య శాఖ అధికారులు రంగంలోకి దిగి, విచారణ ప్రారంభించారు.
 
ఈ విషయంపై ఆరోగ్యశాఖ డిప్యూటీ డైరెక్టర్ రమేశ్ కుమార్ స్పందిస్తూ... ఈ విషయం తమ దృష్టికి వచ్చిందని, ఈ ప్రచారంతో ప్రజలను పూర్తిగా తప్పుదోవ పట్టించడమే అని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ విషయంపై సమగ్ర దర్యాప్తు చేయాలని తాము ఆహార భద్రతా శాఖ వారిని కోరినట్లు రమేశ్ తెలిపారు. 

 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

జటాధర లో శిల్పా శిరోద్కర్ అవార్డ్ విన్నింగ్ పర్ఫామెన్స్‌ చేసింది : నిర్మాత ప్రేరణ అరోరా

Sudeep: కిచ్చా సుదీప్ పాన్ ఇండియా మూవీ మార్క్ టైటిల్ గ్లింప్స్ రిలీజ్

ఉత్తర్ ప్రదేశ్ నేపథ్యంలో అనురాగ్ కశ్యప్ దర్శకత్వంలో నిశాంచి ట్రైలర్ విడుదల

Anupama : దెయ్యంలా వుంటావని అమ్మ తిడుతుండేది : అనుపమ పరమేశ్వరన్

Ileana: నేను తల్లిని కాదని అనిపించిన సందర్భాలున్నాయి.. ఇలియానా

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మొక్కజొన్నలో వున్న పోషకాలు ఏమిటో తెలుసా?

జాతీయ పోషకాహార మాసం: మీ రోజువారీ పోషణను బాదం ఎలా మెరుగుపరుస్తుంది?

Lotus Root: తామర పువ్వు వేర్లను సూప్స్‌, సలాడ్స్‌లో ఉపయోగిస్తే?

జాతీయ దగ్గు దినోత్సవం: డాక్టర్ రెడ్డీస్ సహకారంతో భారతదేశంలో దగ్గుపై అవగాహన

మహిళా విభాగానికి ప్రచార ముఖచిత్రంగా కృతి సనన్‌ను నియమించిన క్యాంపస్ యాక్టివ్‌వేర్

తర్వాతి కథనం
Show comments