Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏది నిజం? హెర్బల్ మైసూర్‌పాక్‌తో కరోనా చెక్? (video)

Webdunia
బుధవారం, 8 జులై 2020 (09:35 IST)
ప్రపంచం మొత్తం కరోనా వైరస్ కోరల్లో చిక్కి కొట్టుమిట్టాడుతోంది. ఈ వైరస్ అంతానికి ప్రపంచ దేశాలన్నీ పరిశోధనల్లో నిమగ్నమైవున్నాయి. ఈ క్రమంలో తమిళనాడు రాష్ట్రంలోని కోయంబత్తూరు, చిన్నియం పాళయంలోని ఓ స్వీట్ షాపు మాత్రం కొత్త ఫార్ములాతో తెరపైకి వచ్చింది. 
 
రోజు ఒకటి 'హెర్బల్ మైసూర్‌పాక్' తినడం ద్వారా కోవిడ్ నుంచి సురక్షితంగా బయటపడొచ్చని ఏకంగా బహిరంగ ప్రకటన కూడా ఇచ్చేసింది. అయితే చుట్టుపక్కల ప్రాంతాల్లో నివాసముంటున్న వారి నుంచి కూడా చాలా మంచి స్పందన కూడా వస్తోందని ఆ షాపు ప్రకటించింది. 
 
కోవిడ్ లక్షణాలున్న వారందరూ ఉచితంగా పొందవచ్చని ఆ షాపు యాజమాన్యం పేర్కొంది. ఈ ‘హెర్బల్ మైసూర్ పాక్’ ఫార్ములాను కేంద్ర ప్రభుత్వానికి ఇచ్చేందుకు కూడా తాము సిద్ధంగానే ఉన్నామని యజమానులు ప్రకటించారు కూడా. చిన్నియం పాళయం, వెల్లూరు ప్రాంతాల్లో ఈ ప్రచారం ఎంతకూ తగ్గకపోవడంతో ఆరోగ్య శాఖ అధికారులు రంగంలోకి దిగి, విచారణ ప్రారంభించారు.
 
ఈ విషయంపై ఆరోగ్యశాఖ డిప్యూటీ డైరెక్టర్ రమేశ్ కుమార్ స్పందిస్తూ... ఈ విషయం తమ దృష్టికి వచ్చిందని, ఈ ప్రచారంతో ప్రజలను పూర్తిగా తప్పుదోవ పట్టించడమే అని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ విషయంపై సమగ్ర దర్యాప్తు చేయాలని తాము ఆహార భద్రతా శాఖ వారిని కోరినట్లు రమేశ్ తెలిపారు. 

 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Veera Dheera Sooran: చియాన్ విక్రమ్ వీర ధీర సూరన్ పార్ట్ 2 - మార్చి 27 గ్రాండ్ రిలీజ్

Janhvi Kapoor : RC16 లో టెర్రిఫిక్ రోల్ చేస్తున్న జాన్వి కపూర్ !

ఉపవాసం దీక్ష తో మూకుత్తి అమ్మన్ 2 చిత్ర పూజకు హాజరైన నయనతార

మ్యారేజ్ అంటే ఒప్పందం, సెటిల్మెంట్ కాదని చెప్పే చిత్రం మిస్టర్ రెడ్డి

Divya Bharathi: యాక్షన్ సీన్స్ చేయడం కష్టం, ఇలాంటి సినిమా మళ్ళీ రాదు : దివ్యభారతి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నడుస్తున్నప్పుడు ఇలాంటి సమస్యలుంటే మధుమేహం కావచ్చు

మహిళలు బెల్లం ఎందుకు తినాలో తెలుసా?

మహిళలు ప్రతిరోజూ ఆపిల్ కాదు.. ఆరెంజ్ పండు తీసుకుంటే.. ఏంటి లాభమో తెలుసా?

Hibiscus Flower: మహిళలకు మెరిసే అందం కోసం మందార పువ్వు

పుచ్చకాయ ముక్కను ఫ్రిడ్జిలో పెట్టి తింటున్నారా?

తర్వాతి కథనం
Show comments