Webdunia - Bharat's app for daily news and videos

Install App

కన్నబిడ్డను మూడో అంతస్తు నుంచి 2సార్లు తోసేసింది.. ఇంట్లోకి వెళ్ళి మేకప్‌తో బయటికొచ్చింది..

కన్నబిడ్డను ఏ తల్లి మూడంతస్తుల భవనం మీద నుంచి కిందతోసి హత్య చేసింది. ఈ ఘటన బెంగళూరులోని జరిగేనహళ్లిలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే... కాంచన్ సర్కార్ దంపతులు పశ్చిమ బెంగాల్ నుంచి బెంగళూరుకు వచ్చి

Webdunia
మంగళవారం, 29 ఆగస్టు 2017 (11:59 IST)
కన్నబిడ్డను ఏ తల్లి మూడంతస్తుల భవనం మీద నుంచి కిందతోసి హత్య చేసింది. ఈ ఘటన బెంగళూరులోని జరిగేనహళ్లిలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే... కాంచన్ సర్కార్ దంపతులు పశ్చిమ బెంగాల్ నుంచి బెంగళూరుకు వచ్చి అక్కడే నివాసం వుంటున్నారు. కాంచన్‌ సర్కార్‌ ప్రముఖ ఐటీ కంపెనీలో బిజినెస్‌ అనలిస్టుగా పని చేస్తుండగా, అతని భార్య స్వాతి సర్కార్‌ ఓ పాఠశాలలో హిందీ టీచరుగా పని చేసేది. 
 
కానీ కొద్దికాలంలో స్వాతి మానసిక ప్రవర్తన బాగోలేకపోవడంతో ఉద్యోగం మానేసింది. ఇక భర్త కూడా కొద్దికాలంగా భార్యకు దూరంగా వుంటున్నాడు. ఎప్పుడో ఒకసారి ఇంటికి వస్తుండేవాడు. దీంతో స్వాతి సర్కార్ బుద్ధి మారింది. ఈ నేపథ్యంలో ఆదివారం సాయంత్రం స్వాతి తన ఏడేళ్ల కుమార్తె శ్రేయాను మూడో అంతస్తుపై నుంచి కిందకు తోసేసింది. 
 
శ్రేయ మూగ బాలిక కావడంతో కేకలు వేయలేకపోయింది. ఈ ఘటనలో గాయపడిన చిన్నారిని స్వాతి మళ్లీ పైకి తీసుకెళ్లి కిందపడేసింది. ఈ ఘటనలో శ్రేయా తీవ్రగాయాలతో మృతి చెందింది. ఆ తర్వాత స్వాతి ఏమీ తెలియనట్లుగా ఇంట్లోకి వెళ్లి మేకప్ వేసుకుని ముస్తాబై బయటికి వచ్చింది. 
 
కూతురి మృతదేహం ఉన్నా పట్టించుకోకుండా వెళ్ళిపోతున్న తల్లిని స్థానికులు పట్టుకుని దేహశుధ్ది చేశారు. ఆపై ఆమెను పోలీసులకు అప్పగించారు. కేసు నమోదు చేసుకొని నిందితురాలిని అరెస్ట్‌ చేసిన పుట్టెనహళ్లి పోలీసులు కుటుంబ కలహాలతోనే శ్రేయను హత్య చేసి ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Pawan Singh: వివాదంలో పవన్ సింగ్.. హీరోయిన్ అంజలి నడుమును తాకాడు (video)

Pawan Kalyan: ఉస్తాద్ భగత్ సింగ్ పుట్టినరోజు పోస్టర్‌ విడుదల

Monalisa: మలయాళ సినిమాలో నటించనున్న కుంభమేళా మోనాలిసా

Havish: కీలక సన్నివేశాల చిత్రీకరణలో హవీష్, కావ్య థాపర్ ల నేను రెడీ

ప్రియదర్శి, నిహారిక ఎన్.ఎం. నటించిన మిత్ర మండలి దీపావళికి రాబోతోంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జాతీయ దగ్గు దినోత్సవం: డాక్టర్ రెడ్డీస్ సహకారంతో భారతదేశంలో దగ్గుపై అవగాహన

మహిళా విభాగానికి ప్రచార ముఖచిత్రంగా కృతి సనన్‌ను నియమించిన క్యాంపస్ యాక్టివ్‌వేర్

ఆరోగ్యకరమైన జీర్ణవ్యవస్థ కోసం బాదం తినండి

పేషెంట్-సెంట్రిక్ ఇమేజింగ్‌లో విప్లవాత్మక మార్పులు తీసుకురానున్న శామ్‌సంగ్ ఇండియా

మతిమరుపు సమస్యను వదిలించుకోవాలంటే ఏం చేయాలి?

తర్వాతి కథనం
Show comments