Webdunia - Bharat's app for daily news and videos

Install App

గెటప్ మార్చిన పోలీసులు.. 14 రోజుల పసికందును అమ్మకానికి పెట్టిన డాక్టర్‌ను పట్టేశారు.. ఎక్కడ?!

ఆస్పత్రుల్లో పుట్టి వారాలే గడిచిన పసికందుల విక్రయాలు పెచ్చరిల్లిపోతున్నాయి. కానీ శిశువుల విక్రయానికి బ్రేక్ వేసేందుకు పోలీసులు దంపతుల అవతారం ఎత్తారు.

Webdunia
శుక్రవారం, 24 జూన్ 2016 (16:52 IST)
ఆస్పత్రుల్లో పుట్టి వారాలే గడిచిన పసికందుల విక్రయాలు పెచ్చరిల్లిపోతున్నాయి. కానీ శిశువుల విక్రయానికి బ్రేక్ వేసేందుకు పోలీసులు దంపతుల అవతారం ఎత్తారు. ఈ ఘటన తమిళనాడులోని శివగంగ జిల్లాలో చోటుచేసుకుంది. పోలీసులు ఇలా వేషధారణ మార్చడంతో రెండు వారాల శిశువును విక్రయించేందుకు ప్రయత్నించిన వైద్యురాలితో పాటు ఆమె భర్త కూడా పోలీసులు దొరికిపోయారు. 
 
వివరాల్లోకి వెళితే.. శివగంగ జిల్లాకు చెందిన ఓ మైనర్ బాలిక గర్భం దాల్చింది. అబార్షన్ కోసం శాంచి అనే వైద్యురాలిని సంప్రదించింది. కానీ ఇప్పటికే 8 నెలలు నిండిపోవడంతో అబార్షన్ కష్టమని వైద్యులు తేల్చేశారు. దీంతో ఆ మైనర్ బాలిక ఓ బాబుకు జన్మనిచ్చింది. ఆ శిశువు తనకు వద్దనడంతో అమ్మేందుకు వైద్యురాలు శాంతి ప్రయత్నించింది. 
 
కానీ సదరు ఆసుపత్రిలో శిశు విక్రయాల రాకెట్ జరుగుతోందని సమాచారం అందుకున్న పోలీసులు వేషం మార్చారు. దంపతుల గెటప్‌తో బాబును కొనుగోలు చేస్తామంటూ.. డాక్టర్ శాంతితో పాటు ఆమె భర్తను ఆశ్రయించారు. శిశువును అమ్మేందుకు బేరం కుదరడంతో డాక్టర్ శాంతితో పాటు ఆమె భర్తను పోలీసులు  రెడ్‌హ్యాండెడ్‌గా అరెస్ట్ చేసి విచారణ జరుపుతున్నారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

లంచ‌గొండుల‌పై సేనాప‌తి స్వైర విహారం భారతీయుడు 2’ ట్రైలర్

శాపనార్థాలు పెట్టిన రేణూ దేశాయ్.. వారికి చెడు కర్మ ఖచ్చితం... ఎవరికి?

బాలీవుడ్ వైపు మళ్లిన హీరోయిన్.. మృణాల్ ఠాకూర్ వర్సెస్ శ్రీలీల

మా నాన్న కూడా ఇంత ఖర్చు పెట్టి సినిమా తీయలేదు : బడ్డీ మూవీ హీరో అల్లు శిరీష్

ఆది సాయికుమార్ విజువ‌ల్ వండ‌ర్ ష‌ణ్ముఖ షూటింగ్ పూర్తి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జుట్టు ఊడిపోతుందా? ఇవి కూడా కారణం కావచ్చు

బెండ కాయలు ఎందుకు తినాలో తెలుసా?

పాలుతో చేసే టీ తాగితే కలిగే ప్రయోజనాలు ఏమిటి?

పచ్చిమిరపకాయలను నానబెట్టిన నీటిని తాగితే?

పిల్లలు, మహిళలు పిస్తా పప్పులు తింటే?

తర్వాతి కథనం
Show comments