Webdunia - Bharat's app for daily news and videos

Install App

గెటప్ మార్చిన పోలీసులు.. 14 రోజుల పసికందును అమ్మకానికి పెట్టిన డాక్టర్‌ను పట్టేశారు.. ఎక్కడ?!

ఆస్పత్రుల్లో పుట్టి వారాలే గడిచిన పసికందుల విక్రయాలు పెచ్చరిల్లిపోతున్నాయి. కానీ శిశువుల విక్రయానికి బ్రేక్ వేసేందుకు పోలీసులు దంపతుల అవతారం ఎత్తారు.

Webdunia
శుక్రవారం, 24 జూన్ 2016 (16:52 IST)
ఆస్పత్రుల్లో పుట్టి వారాలే గడిచిన పసికందుల విక్రయాలు పెచ్చరిల్లిపోతున్నాయి. కానీ శిశువుల విక్రయానికి బ్రేక్ వేసేందుకు పోలీసులు దంపతుల అవతారం ఎత్తారు. ఈ ఘటన తమిళనాడులోని శివగంగ జిల్లాలో చోటుచేసుకుంది. పోలీసులు ఇలా వేషధారణ మార్చడంతో రెండు వారాల శిశువును విక్రయించేందుకు ప్రయత్నించిన వైద్యురాలితో పాటు ఆమె భర్త కూడా పోలీసులు దొరికిపోయారు. 
 
వివరాల్లోకి వెళితే.. శివగంగ జిల్లాకు చెందిన ఓ మైనర్ బాలిక గర్భం దాల్చింది. అబార్షన్ కోసం శాంచి అనే వైద్యురాలిని సంప్రదించింది. కానీ ఇప్పటికే 8 నెలలు నిండిపోవడంతో అబార్షన్ కష్టమని వైద్యులు తేల్చేశారు. దీంతో ఆ మైనర్ బాలిక ఓ బాబుకు జన్మనిచ్చింది. ఆ శిశువు తనకు వద్దనడంతో అమ్మేందుకు వైద్యురాలు శాంతి ప్రయత్నించింది. 
 
కానీ సదరు ఆసుపత్రిలో శిశు విక్రయాల రాకెట్ జరుగుతోందని సమాచారం అందుకున్న పోలీసులు వేషం మార్చారు. దంపతుల గెటప్‌తో బాబును కొనుగోలు చేస్తామంటూ.. డాక్టర్ శాంతితో పాటు ఆమె భర్తను ఆశ్రయించారు. శిశువును అమ్మేందుకు బేరం కుదరడంతో డాక్టర్ శాంతితో పాటు ఆమె భర్తను పోలీసులు  రెడ్‌హ్యాండెడ్‌గా అరెస్ట్ చేసి విచారణ జరుపుతున్నారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Mumait Khan: ముమైత్ ఖాన్ తాజా లుక్ చూస్తే.. వాళ్లంతా పడిపోతారు.. (Photos)

క్రైమ్ వరల్డ్ నేపథ్యానికి భిన్నంగా నాని HIT: The 3rd Case

15వ దాదాఫాల్కే ఫిలిం ఫెస్టివల్ లో బెస్ట్ ఫిలిం కేటగిరీలో కిరణ్ అబ్బవరం క సినిమా

హ్యాట్రిక్ హిట్ రావడం ఆనందంగా ఉంది- ఇంద్రగంటి మోహనకృష్ణ

అఖండ 2: తాండవం జార్జియా లొకేషన్స్ లో బోయపాటి శ్రీను పుట్టినరోజు వేడుక

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

టమోటాలను తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

Annapurna yojana scheme: మహిళలకు వరం.. అన్నపూర్ణ యోజన పథకం.. షరతులు ఇవే

తాటి ముంజలు వేసవిలో ఎందుకు తినాలి

హైదరాబాద్‌ కొండాపూర్‌లో 3వ స్టోర్‌ను ప్రారంభించిన టిబిజెడ్-ది ఒరిజినల్

సబ్జా గింజలు నీటిలో నానబెట్టి తాగితే...

తర్వాతి కథనం
Show comments