Webdunia - Bharat's app for daily news and videos

Install App

25 వేళ్లతో జన్మించిన శిశువు!! భువనేశ్వరి దేవి అనుగ్రహమంటూ...

వరుణ్
సోమవారం, 22 జులై 2024 (11:46 IST)
కర్నాటక రాష్ట్రంలోని బాగల్‌‍కోట్‌ జిల్లాలో ఓ మహిళ వింత శిశువుకు జన్మనిచ్చింది. ఏకంగా 25 వేళ్ళతో జన్మించింది. చేతికి 12, కాళ్ళకు 13 వేళ్ళు ఉన్నాయి. ఇలా మొత్తం 25 వేళ్లు ఉండటంతో భువనేశ్వరి దేవి అనుగ్రహం వల్లే ఇలా జరిగిందంటూ కుటుంబ సభ్యులు సంబరపడిపోతున్నారు. పైగా, ఆ చిన్నారిని చూసేందుకు స్థానికులు భారీగా తరలివస్తున్నారు. 
 
జిల్లాలోని రబకావి బన్‌‍హట్టి పట్ణంలోని సన్ షైన్ ఆస్పత్రిలో ఈ బిడ్డ పుట్టింది. ఆస్పత్రి ప్రసూతి వైద్యురాలు పార్వతి హిరేమత్ మాట్లాడుతూ, క్రోమోజోముల్లో అసమతుల్యత వల్ల ఒక్కోసారి ఇలా జరుగుతుందని ఇలాంటి ఘటనలు చాలా అరుదని తెలిపారు. తల్లీపిల్లలు ఇద్దరూ క్షేమంగా ఉన్నట్టు పేర్కొన్నారు. చిన్నారికి భారతి అని పేరు పెట్టామని చెప్పారు. 
 
తమ కుమార్తె గురించి తండ్రి గురప్ప స్పందిస్తూ, సంతానం కోసం తన భార్య కుందరిగి శ్రీ భువనేశ్వరి శక్తీపఠం సురగిరి హిల్స్ ఆలయంలో పూజలు చేసిందని, అమ్మవారి అనుగ్రహంతోనే పాప ఇలా జన్మించిందని చెప్పారు. కాగా, గత యేడాది రాజస్థాన్ రాష్ట్రంలో కూడా ఓ చిన్నారి ఏకంగా 26 వేళ్లతో జన్మించిన విషయం తెల్సిందే. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Court : రహస్యంగా కోర్టు దర్శకుడి వివాహం.. వధువు ఎవరంటే?

ప్రభాస్‌తో స్నేహం వుంది: శ్రీ దేవి విజయ్ కుమార్

CM: ఎ.రేవంత్ రెడ్డి ని కలిసిన జాతీయ ఫిల్మ్ అవార్డ్సు గ్ర‌హీత‌లు

మంజుమ్మెల్ బాయ్స్ డైరెక్టర్ చిదంబరం మూవీ బాలన్ ఫస్ట్ లుక్

రక్షిత్ అట్లూరి, కోమలి ప్రసాద్ జంటగా సంగీతభరిత ప్రేమకథగా శశివదనే

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జీడి పప్పులో వున్న పోషకాలు ఏమిటి?

వయోజనుల కోసం 20-వాలెంట్ న్యుమోకాకల్ కాంజుగేట్ వ్యాక్సిన్‌ను ఆవిష్కరించిన ఫైజర్

మెడికవర్ క్యాన్సర్ ఇన్‌స్టిట్యూట్ ఉచిత క్యాన్సర్ నిర్ధారణ వైద్య శిబిరం

పిట్యూటరీ గ్రంథి ఆరోగ్యకరంగా లేకపోతే సంతానం శూన్యం, ఎందుకంటే?

వేరుశనగ పల్లీలు తింటున్నారా?

తర్వాతి కథనం
Show comments