Webdunia - Bharat's app for daily news and videos

Install App

25 వేళ్లతో జన్మించిన శిశువు!! భువనేశ్వరి దేవి అనుగ్రహమంటూ...

వరుణ్
సోమవారం, 22 జులై 2024 (11:46 IST)
కర్నాటక రాష్ట్రంలోని బాగల్‌‍కోట్‌ జిల్లాలో ఓ మహిళ వింత శిశువుకు జన్మనిచ్చింది. ఏకంగా 25 వేళ్ళతో జన్మించింది. చేతికి 12, కాళ్ళకు 13 వేళ్ళు ఉన్నాయి. ఇలా మొత్తం 25 వేళ్లు ఉండటంతో భువనేశ్వరి దేవి అనుగ్రహం వల్లే ఇలా జరిగిందంటూ కుటుంబ సభ్యులు సంబరపడిపోతున్నారు. పైగా, ఆ చిన్నారిని చూసేందుకు స్థానికులు భారీగా తరలివస్తున్నారు. 
 
జిల్లాలోని రబకావి బన్‌‍హట్టి పట్ణంలోని సన్ షైన్ ఆస్పత్రిలో ఈ బిడ్డ పుట్టింది. ఆస్పత్రి ప్రసూతి వైద్యురాలు పార్వతి హిరేమత్ మాట్లాడుతూ, క్రోమోజోముల్లో అసమతుల్యత వల్ల ఒక్కోసారి ఇలా జరుగుతుందని ఇలాంటి ఘటనలు చాలా అరుదని తెలిపారు. తల్లీపిల్లలు ఇద్దరూ క్షేమంగా ఉన్నట్టు పేర్కొన్నారు. చిన్నారికి భారతి అని పేరు పెట్టామని చెప్పారు. 
 
తమ కుమార్తె గురించి తండ్రి గురప్ప స్పందిస్తూ, సంతానం కోసం తన భార్య కుందరిగి శ్రీ భువనేశ్వరి శక్తీపఠం సురగిరి హిల్స్ ఆలయంలో పూజలు చేసిందని, అమ్మవారి అనుగ్రహంతోనే పాప ఇలా జన్మించిందని చెప్పారు. కాగా, గత యేడాది రాజస్థాన్ రాష్ట్రంలో కూడా ఓ చిన్నారి ఏకంగా 26 వేళ్లతో జన్మించిన విషయం తెల్సిందే. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

తప్పు చేసినట్టు నిరూపిస్తే నా భర్తను వదిలేస్తా : జానీ మాస్టర్ సతీమణి

మెగాస్టార్ చిరంజీవి విశ్వంభర విజృంభణం ఆగమనం డేట్ ఫిక్స్

మా నాన్న సూపర్ హీరో' నుంచి నాన్న సాంగ్ రిలీజ్

తెలంగాణ-మహారాష్ట్ర సరిహద్దులో 1960లో జరిగిన కథతో శర్వానంద్, సంపత్ నంది చిత్రం

జానీ మాస్టర్ ఇష్యూలో రాజకీయరంగు - మీడియాపై కేసుపెడతానన్న జానీమాస్టర్ భార్య అయేషా

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

హైదరాబాద్‌లో బెస్పోక్ టైలరింగ్, ఫైన్ క్లాతింగ్‌లో 100 ఏళ్ల వారసత్వం కలిగిన పిఎన్ రావు కార్యక్రమాలు

డిజైన్ డెమోక్రసీ 2024-డిజైన్, ఆర్ట్- ఇన్నోవేషన్ యొక్క భవిష్యత్తు

మెక్‌డొనాల్డ్స్ ఇండియా నుంచి మెక్‌క్రిస్పీ చికెన్ బర్గర్, క్రిస్పీ వెజ్జీ బర్గర్‌

మునగాకును ఉడకబెట్టిన నీటిని ప్రతిరోజూ ఉదయం తాగితే..

ఖాళీ కడుపుతో వెల్లుల్లిని తేనెతో కలిపి తింటే?

తర్వాతి కథనం
Show comments