Webdunia - Bharat's app for daily news and videos

Install App

రామ మందిరంలో రామ విగ్రహ ప్రాణప్రతిష్టకు ముహూర్తం ఖరారు

Webdunia
మంగళవారం, 21 నవంబరు 2023 (15:41 IST)
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని అయోధ్యలో భవ్య రామ మందిరంలో రామ్‌‍లల్లా ప్రాణప్రతిష్టకు ముహూర్తాన్ని ఖరారు చేశఆరు. వచ్చే యేడాది జనవరి 22వ తేదీన మధ్యాహ్నం 12.20 గంటలకు ఈ ప్రాణప్రతిష్ట కార్యక్రమం జరుగనుంది. ఇందులో ప్రధాని నరేంద్ర మోడీ పాల్గొంటున్నారు. ఈ ప్రాణప్రతిష్ట వేడుకలను నాలుగు దశలుగా విభజించారు. 
 
తొలి దశలో పలు స్టీరింగ్ కమిటీలను ఏర్పాటు చేసి కార్యక్రమ నిర్వహణకు అంతరాయం కలగకుండా జాగ్రత్తలు తీసుకుంటారు. రెండో దశలో 10 కోట్ల కుటుంబాలకు రాముడి చిత్రపటం, కరపత్రం అందించనున్నారు. మూడో దశలో జనవరి 22న దేశంలోని అనేక ప్రాంతాల్లో వేడుకలు నిర్వహించనున్నారు. నాలుగో దశలో జనవరి 26 నుంచి భక్తులకు రామయ్య దర్శనం కల్పించనున్నారు.
 
ఇదిలావుంటే, 14వ అయోధ్య నగర ప్రదక్షిణ కార్యక్రమానికి ఏర్పాట్లు పూర్తిచేశారు. ఈ నెల 21 (మంగళవారం) తెల్లవారుజామున 2 గంటలకు ప్రారంభంకానున్న ప్రదక్షిణ.. రాత్రి 11.38 గంటలకు ముగియనుంది. ఇందులోభాగంగా రామభక్తులు 42 కిలోమీటర్లు ప్రదక్షిణ చేయనున్నారు. ఇదిలావుంటే, రామ మందిరంలో అర్చకుల పోస్టులకు సంబంధించి దాదాపు 3 వేల మంది దరఖాస్తు చేసుకున్నట్లు రామ మందిర తీర్థ క్షేత్ర ట్రస్టు పేర్కొంది. వీరిలో 200 మందిని మెరిట్ ప్రాతిపదికన ఎంపిక చేసి ఇంటర్వ్యూలు నిర్వహిస్తున్నట్లు వెల్లడించింది. వీరిలో 20 మందిని అర్చకులుగా ఎంపిక చేయనున్నట్టు ట్రస్ట్ నిర్వాహకులు వెల్లడించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Venkatesh: విక్టరీ వెంకటేష్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ సినిమా మొదలు

ఇండస్ట్రీలో ఎవరి కుంపటి వారిదే : అల్లు అరవింద్ సంచలన వ్యాఖ్యలు

పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా ప్రభాస్ స్పిరిట్ లో కనిపించనున్నారా !

పెంచల్ రెడ్డి జీవిత కథతో ఆపద్భాంధవుడు చిత్రం: భీమగాని సుధాకర్ గౌడ్

Chiranjeevi: చిరంజీవితో విశ్వంభర లో సత్యలోకం చూపిస్తున్న వసిష్ఠ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పిట్యూటరీ గ్రంథి ఆరోగ్యకరంగా లేకపోతే సంతానం శూన్యం, ఎందుకంటే?

వేరుశనగ పల్లీలు తింటున్నారా?

బత్తాయి రసం వర్షాకాలంలో తాగితే.. సీజనల్ వ్యాధులు దూరం

పెరుగుతో వీటిని కలిపి తినకూడదు, ఎందుకంటే?

సత్తెనపల్లి మొల్లమాంబ వృద్ధాశ్రమంలో నాట్స్ అన్నదానం

తర్వాతి కథనం
Show comments