Webdunia - Bharat's app for daily news and videos

Install App

48 గంటల్లో 42 మంది చిన్నారుల మృతి... గోరఖ్‌పూర్‌లో దారుణం

ఉత్తరప్రదేశ్ రాష్ట్రం, గోరఖ్‌పూర్‌లోని బీఆర్డీ ఆస్పత్రిలో చిన్నారుల మరణమృదంగ ఘోష ఇప్పట్లో ఆగేలా కనిపించడం లేదు. గడచిన 48 గంటల్లో 42 మంది చిన్నారులు ప్రాణాలు కోల్పోయారు. ఈ చిన్నారుల మృతిపై బీఆర్డీ మెడి

Webdunia
బుధవారం, 30 ఆగస్టు 2017 (12:37 IST)
ఉత్తరప్రదేశ్ రాష్ట్రం, గోరఖ్‌పూర్‌లోని బీఆర్డీ ఆస్పత్రిలో చిన్నారుల మరణమృదంగ ఘోష ఇప్పట్లో ఆగేలా కనిపించడం లేదు. గడచిన 48 గంటల్లో 42 మంది చిన్నారులు ప్రాణాలు కోల్పోయారు. ఈ చిన్నారుల మృతిపై బీఆర్డీ మెడికల్ కాలేజీ ప్రిన్సిపాల్ పీకే సింగ్ స్పందించారు. 42 మంది చిన్నారుల్లో.. ఏడుగురు మెదడువాపు వ్యాధితో, మరో 35 మంది చిన్నారులు ఇతర కారణాలతో మృతి చెందినట్లు ఆయన వెల్లడించారు.
 
ఆగస్టు 27వ తేదీన చిన్నపిల్లల విభాగంలో 342 మంది చిన్నారులు చికిత్స కోసం చేరారు. అందులో 17 మంది మృతి చెందారు. ఆగస్టు 28న 344 మంది చిన్నారులు చికిత్స పొందుతుండగా 25 మంది చిన్నారులు మృతి చెందినట్లు పీకే సింగ్ తెలిపారు. ఆగస్టు 7 నుంచి 11వ తేదీ మధ్యలో ఆక్సిజన్ అందక 60 మంది చిన్నారులు మృతి చెందిన విషయం విదితమే. 
 
కాగా, చిన్నారుల మృతి కేసుకు సంబంధించి.. బీఆర్డీ మెడికల్ కాలేజీ మాజీ ప్రిన్సిపాల్ డాక్టర్ రాజీవ్ మిశ్రా, ఆయన భార్య పూర్ణిమ శుక్లాను పోలీసులు కాన్పూర్‌లో అరెస్టు చేసిన విషయం తెలిసిందే. 
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Ashwin Babu: వచ్చిన వాడు గౌతమ్ గా అశ్విన్ బాబు రన్నింగ్ లుక్

మయసభ అద్భుతాలు సృష్టించాలని కోరుకుంటున్నాను : సాయి దుర్గ తేజ్

వెంకన్న స్వామి ఆశీస్సులు, ప్రేక్షకుల ప్రేమ వల్లే ఈ విజయం : విజయ్ దేవరకొండ

నారా రోహిత్, శ్రీ దేవి విజయ్ కుమార్ చిత్రం సుందరకాండ నుంచి ప్లీజ్ మేమ్ సాంగ్

హనీ మూన్ ఇన్ షిల్లాంగ్ వెండితెరపై రాబోతుంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

విడాకులు తీసుకున్న మహిళను పెళ్లాడితే ఎలా వుంటుంది?

కుషాల్స్ ఫ్యాషన్ జ్యువెలరీ, నటి ఆషికా రంగనాథ్‌తో వరమహాలక్ష్మిని జరుపుకోండి

గుండె ఆరోగ్యానికి లేత చింతకాయ పచ్చడి, ఇంకా ఎన్నో ప్రయోజనాలు

Saffron Milk: పిల్లలకు రోజూ కుంకుమ పువ్వు పాలను ఇవ్వవచ్చా?

నార్త్ కరోలినాలో నాట్స్ బాలల సంబరాలు, ఉత్సాహంగా పాల్గొన్న తెలుగు విద్యార్ధులు

తర్వాతి కథనం
Show comments