Webdunia - Bharat's app for daily news and videos

Install App

గొడ్డు మాంసం తినే మీకెందుకురా సీట్లు... రైలులో విద్వేష దాడి..

సాధారణంగా విదేశాల్లో భారతీయులపై విద్వేష దాడి సంఘటనలు జరుగుతున్నట్టు తెలుసు. కానీ, ఇదే తరహా విద్వేష దాడి మన దేశంలో కూడా జరిగింది. నలుగురు ముస్లిం యువకులపై 15మందితో కూడిన హిందూ యువకుల ముఠా ఒకటి దాడి చేస

Webdunia
శనివారం, 24 జూన్ 2017 (12:17 IST)
సాధారణంగా విదేశాల్లో భారతీయులపై విద్వేష దాడి సంఘటనలు జరుగుతున్నట్టు తెలుసు. కానీ, ఇదే తరహా విద్వేష దాడి మన దేశంలో కూడా జరిగింది. నలుగురు ముస్లిం యువకులపై 15మందితో కూడిన హిందూ యువకుల ముఠా ఒకటి దాడి చేసింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే... 
 
ఢిల్లీ నుంచి మధుర వెళ్తున్న రైలులో నలుగురు ముస్లిం యువకులు కూర్చుని ప్రయాణిస్తున్నారు. అంతలో అక్కడికి 15 మంది యువకులతో కూడిన ముఠా ఒకటి వచ్చి సీట్లు తమకిచ్చి వెళ్లిపోవాలని హెచ్చరించారు. దానికి ఆ నలుగురు ముస్లిం యువకులు నిరాకరించారు.
 
సీట్లు తమవని, అలా వెళ్లాల్సిన అవసరం లేదని తేల్చిచెప్పారు. దీంతో ఆగ్రహానికి గురైన ఓ హిందూ యువకుడు వారిని గొడ్డు మాసం తినేవారికి సీట్లు ఎందుకురా? అంటూ అసభ్య పదజాలంతో దూషించాడు. ఈ వ్యాఖ్యలను వారు వ్యతిరేకించారు. దీంతో ఆ 15 మంది కలిసి ఆ నలుగురినీ గొడ్డును బాదినట్టు బాదారు. 
 
అంతేకాదు, జునైద్‌ అనే 17 ఏళ్ల యువకుడ్ని కత్తితో పొడిచి చంపేశారు. అతని సోదరుడితో పాటు మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. వారిలో షాకిర్ (23) అనే యువకుడి పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. 

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments