Webdunia - Bharat's app for daily news and videos

Install App

గొడ్డు మాంసం తినే మీకెందుకురా సీట్లు... రైలులో విద్వేష దాడి..

సాధారణంగా విదేశాల్లో భారతీయులపై విద్వేష దాడి సంఘటనలు జరుగుతున్నట్టు తెలుసు. కానీ, ఇదే తరహా విద్వేష దాడి మన దేశంలో కూడా జరిగింది. నలుగురు ముస్లిం యువకులపై 15మందితో కూడిన హిందూ యువకుల ముఠా ఒకటి దాడి చేస

Webdunia
శనివారం, 24 జూన్ 2017 (12:17 IST)
సాధారణంగా విదేశాల్లో భారతీయులపై విద్వేష దాడి సంఘటనలు జరుగుతున్నట్టు తెలుసు. కానీ, ఇదే తరహా విద్వేష దాడి మన దేశంలో కూడా జరిగింది. నలుగురు ముస్లిం యువకులపై 15మందితో కూడిన హిందూ యువకుల ముఠా ఒకటి దాడి చేసింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే... 
 
ఢిల్లీ నుంచి మధుర వెళ్తున్న రైలులో నలుగురు ముస్లిం యువకులు కూర్చుని ప్రయాణిస్తున్నారు. అంతలో అక్కడికి 15 మంది యువకులతో కూడిన ముఠా ఒకటి వచ్చి సీట్లు తమకిచ్చి వెళ్లిపోవాలని హెచ్చరించారు. దానికి ఆ నలుగురు ముస్లిం యువకులు నిరాకరించారు.
 
సీట్లు తమవని, అలా వెళ్లాల్సిన అవసరం లేదని తేల్చిచెప్పారు. దీంతో ఆగ్రహానికి గురైన ఓ హిందూ యువకుడు వారిని గొడ్డు మాసం తినేవారికి సీట్లు ఎందుకురా? అంటూ అసభ్య పదజాలంతో దూషించాడు. ఈ వ్యాఖ్యలను వారు వ్యతిరేకించారు. దీంతో ఆ 15 మంది కలిసి ఆ నలుగురినీ గొడ్డును బాదినట్టు బాదారు. 
 
అంతేకాదు, జునైద్‌ అనే 17 ఏళ్ల యువకుడ్ని కత్తితో పొడిచి చంపేశారు. అతని సోదరుడితో పాటు మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. వారిలో షాకిర్ (23) అనే యువకుడి పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Mumait Khan: ముమైత్ ఖాన్ తాజా లుక్ చూస్తే.. వాళ్లంతా పడిపోతారు.. (Photos)

క్రైమ్ వరల్డ్ నేపథ్యానికి భిన్నంగా నాని HIT: The 3rd Case

15వ దాదాఫాల్కే ఫిలిం ఫెస్టివల్ లో బెస్ట్ ఫిలిం కేటగిరీలో కిరణ్ అబ్బవరం క సినిమా

హ్యాట్రిక్ హిట్ రావడం ఆనందంగా ఉంది- ఇంద్రగంటి మోహనకృష్ణ

అఖండ 2: తాండవం జార్జియా లొకేషన్స్ లో బోయపాటి శ్రీను పుట్టినరోజు వేడుక

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

టమోటాలను తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

Annapurna yojana scheme: మహిళలకు వరం.. అన్నపూర్ణ యోజన పథకం.. షరతులు ఇవే

తాటి ముంజలు వేసవిలో ఎందుకు తినాలి

హైదరాబాద్‌ కొండాపూర్‌లో 3వ స్టోర్‌ను ప్రారంభించిన టిబిజెడ్-ది ఒరిజినల్

సబ్జా గింజలు నీటిలో నానబెట్టి తాగితే...

తర్వాతి కథనం
Show comments