Webdunia - Bharat's app for daily news and videos

Install App

మార్నింగ్ వాక్ చేస్తున్న డీఐజీ ఫోనునే చోరీ చేశారు... ఎక్కడ?

Webdunia
సోమవారం, 24 జులై 2023 (08:57 IST)
కొందరు దొంగలు.. తమ చేతివాటాన్ని బాగానే ప్రదర్శిస్తుంటారు. తాజాగా ఓ డీఐజీ ఫోనును కొట్టేశారు. డీజీపీ మార్నింగ్ వాక్ చేసుతుండగా, ఈ చోరీ జరిగింది. ఈ ఘటన పోలీసు వర్గాలను విస్మయానికి గురిచేసింది. తలవంపులు తెచ్చిపెట్టింది. సాక్షాత్ ఓ రాష్ట్ర డీఐజీ ఫోనును కొట్టేయడం సిగ్గుచేటని పేర్కొంటున్నారు. ఈ ఘటన అస్సాం రాష్ట్రంలో జరిగింది. 
 
ఈ రాష్ట్ర రాజధాని గౌహతిలో ఆదివారం వెలుగు చూసింది. ఈ రాష్ట్ర లా అండ్ ఆర్డర్ విభాగం డీఐజీగా ఉన్న వివేక్ రాజ్ సింగ్ ఆదివారం ఉదయం మార్నింగ్ వాక్ చేస్తున్నారు. ఆ సమయంలో బైకుపై వచ్చిన ఇద్దరు దొంగలు ఆయన ఫోనును లాక్కొని పారిపోయారు. ఈ ఘటన ఆ రాష్ట్ర పోలీస్ ప్రధాన కార్యాలయానికి కూతవేటు దూరంలోవున్న మాజర్ రోడ్డులో జరిగింది. పైగా, ఆ రోడ్డు పక్కనే అనేక ఐపీఎస్ అధికారుల అధికారిక నివాసాలు కూడా ఉండటం గమనార్హం. 
 
ఈ చోరీ ఘటనపై గౌహతి పోలీస్ అసిస్టెంట్ పోలీస్ కమిషనర్ ప్రీతిబీ రాజ్‌ఖోవా స్పందిస్తూ, ఈ ఘటన పల్టన్ బజార్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిందని, దీనిపై దర్యాప్తు చేస్తున్నట్టు తెలిపారు. నిందితుల కోసం ముమ్మరంగా గాలిస్తున్నామన్నారు. అయితే, ఈ చోరీ ఘటన పోలీసు శాఖకు తలవంపులు తెచ్చిపెట్టిందని కొందరు పోలీస్ ఉన్నతాధికారులు వాపోతున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

భారతీయ సినిమా కథల్లోకి హిందూయిజం, ఆధ్యాత్మికత ప్రవేశిస్తున్నాయా? ప్రత్యేక కథనం

మస్తాన్ సాయి వల్ల దర్గాకు అపవిత్రత... గవర్నర్‌కు లావణ్య లేఖ

రజనీకాంత్‌ కూలీలో అమితాబ్‌, నాగార్జున ఎంట్రీ షురూ !

కార్తీక్ ఆర్యన్‌తో గ్లామర్ డోస్ పెంచేసిన శ్రీలీల.. బాలీవుడ్‌లో హిట్టవుతుందా? (video)

తెలుగురాని అమ్మాయిలను బాగా ప్రేమిస్తాం... ఎంకరేజే చేస్తాం : నిర్మాత ఎస్‌కేఎన్ (Video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సందీప్ మక్తాలా, బాబా రామ్‌దేవ్ సమన్వయంతో సమగ్ర ఆరోగ్య విప్లవం

GBS Virus: మహారాష్ట్రలో కొత్త వైరస్.. ఏపీలోనూ పదేళ్ల బాలుడి మృతి.. లక్షణాలివే.. అలెర్ట్

ఎసిడిటీని పెంచే 10 ఆహారాలు, ఏంటవి?

క్యాన్సర్ అవగాహన పెంచడానికి SVICCAR వాకథాన్, సైక్లోథాన్, స్క్రీనింగ్ క్యాంప్‌

తర్వాతి కథనం
Show comments