Webdunia - Bharat's app for daily news and videos

Install App

మార్నింగ్ వాక్ చేస్తున్న డీఐజీ ఫోనునే చోరీ చేశారు... ఎక్కడ?

Webdunia
సోమవారం, 24 జులై 2023 (08:57 IST)
కొందరు దొంగలు.. తమ చేతివాటాన్ని బాగానే ప్రదర్శిస్తుంటారు. తాజాగా ఓ డీఐజీ ఫోనును కొట్టేశారు. డీజీపీ మార్నింగ్ వాక్ చేసుతుండగా, ఈ చోరీ జరిగింది. ఈ ఘటన పోలీసు వర్గాలను విస్మయానికి గురిచేసింది. తలవంపులు తెచ్చిపెట్టింది. సాక్షాత్ ఓ రాష్ట్ర డీఐజీ ఫోనును కొట్టేయడం సిగ్గుచేటని పేర్కొంటున్నారు. ఈ ఘటన అస్సాం రాష్ట్రంలో జరిగింది. 
 
ఈ రాష్ట్ర రాజధాని గౌహతిలో ఆదివారం వెలుగు చూసింది. ఈ రాష్ట్ర లా అండ్ ఆర్డర్ విభాగం డీఐజీగా ఉన్న వివేక్ రాజ్ సింగ్ ఆదివారం ఉదయం మార్నింగ్ వాక్ చేస్తున్నారు. ఆ సమయంలో బైకుపై వచ్చిన ఇద్దరు దొంగలు ఆయన ఫోనును లాక్కొని పారిపోయారు. ఈ ఘటన ఆ రాష్ట్ర పోలీస్ ప్రధాన కార్యాలయానికి కూతవేటు దూరంలోవున్న మాజర్ రోడ్డులో జరిగింది. పైగా, ఆ రోడ్డు పక్కనే అనేక ఐపీఎస్ అధికారుల అధికారిక నివాసాలు కూడా ఉండటం గమనార్హం. 
 
ఈ చోరీ ఘటనపై గౌహతి పోలీస్ అసిస్టెంట్ పోలీస్ కమిషనర్ ప్రీతిబీ రాజ్‌ఖోవా స్పందిస్తూ, ఈ ఘటన పల్టన్ బజార్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిందని, దీనిపై దర్యాప్తు చేస్తున్నట్టు తెలిపారు. నిందితుల కోసం ముమ్మరంగా గాలిస్తున్నామన్నారు. అయితే, ఈ చోరీ ఘటన పోలీసు శాఖకు తలవంపులు తెచ్చిపెట్టిందని కొందరు పోలీస్ ఉన్నతాధికారులు వాపోతున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సారీ మాత్రమే చెప్పగలను... ఎక్కువ అంచనా వేసి బోల్తాపడ్డాం : మణిరత్నం

Nidhi: రాజా సాబ్ తో గ్లామర్ డోస్ పెంచుకున్న నిధి అగర్వాల్

నా పర్సనల్ లైఫ్ కూడా చాలా చోట్ల కనెక్ట్ అయ్యింది : అనంతిక

థ్రిల్లర్ నేపథ్యంలో సిద్ధార్థ్, శ్రీ గణేష్, అరుణ్ విశ్వ చిత్రం 3 BHK

విజయ్ ఆంటోనీ మార్గన్ నుంచి సోల్ ఆఫ్ మార్గన్’ లిరికల్ వీడియో

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఎముకపుష్టికి ఎండుఖర్జూరం పాలు తాగితే...

టీ తాగుతూ వీటిని తింటున్నారా? ఒక్క క్షణం, ఇవి చూడండి

శరీరానికి శక్తినిచ్చే బాదం, రాగి మాల్ట్‌ ఇలా చేయాలి

ఈ పండ్లు తింటే శరీరానికి కావలసినంత ప్రోటీన్

మిట్రల్ రెగర్జిటేషన్ చికిత్స: దేశంలో ట్రాన్స్‌కాథెటర్-ఎడ్జ్-టు-ఎడ్జ్ రిపేర్ సిస్టం మైక్లిప్‌ను ప్రారంభించిన మెరిల్

తర్వాతి కథనం
Show comments