Webdunia - Bharat's app for daily news and videos

Install App

మానసిక వికలాంగురాలిపై ఖాకీ రేప్.. ఇంటి దగ్గర డ్రాప్ చేస్తానని.. తిరుగుతున్న వాహనంలోనే?

దేశంలో ఢిల్లీ, యూపీలకు తర్వాత మహిళలపై అఘాయిత్యాలకు బెంగళూరు కేరాఫ్ అడ్రెస్‌గా మారింది. ఐటీ రాజధాని అయిన బెంగళూరులో మహిళలకు భద్రత కరువైంది. ఇందుకు నిదర్శనంగా ఇటీవల ఎన్నో సంఘటనలు వెలుగులోకి వచ్చాయి. తాజ

Webdunia
సోమవారం, 16 జనవరి 2017 (16:24 IST)
దేశంలో ఢిల్లీ, యూపీలకు తర్వాత మహిళలపై అఘాయిత్యాలకు బెంగళూరు కేరాఫ్ అడ్రెస్‌గా మారింది. ఐటీ రాజధాని అయిన బెంగళూరులో మహిళలకు భద్రత కరువైంది. ఇందుకు నిదర్శనంగా ఇటీవల ఎన్నో సంఘటనలు వెలుగులోకి వచ్చాయి. తాజాగా రక్షణ కల్పించాల్సిన ఖాకీ మానసిక వికలాంగురాలిపై అత్యాచారానికి పాల్పడిన ఘటన కర్ణాటకలోని తుమకూరు జిల్లా కేంద్రంలో చోటుచేసుకుంది. 
 
ఇంటి దగ్గర డ్రాప్ చేస్తామని నమ్మించిన పోలీసు అధికారి గస్తీ తిరుగుతున్న వాహనంలోనే మానసిక వికలాంగురాలిపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ప్రస్తుతం బాధితురాలు ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. తుమకూరులోని అంతరసనహళ్ళిలో బాధితురాలు (31) తల్లిదండ్రులు, సోదరుడితో కలిసి నివాసం ఉంటున్నది. ఒక చిన్నవిషయంపై కుటుంబ సభ్యులతో అలిగిన ఆమె ఇంటి నుంచి బయటకు వచ్చేసింది. 
 
శనివారం రాత్రి రహదారి పక్కన నడుచుకుంటూ వెళుతున్న సమయంలో ఆమె పక్కన పోలీసు గస్తీ వాహనం వచ్చి ఆగింది. ఎక్కడికి వెళ్తున్నావని తుమకూరు గ్రామీణ పోలీస్ స్టేషన్ ఏఎస్ఐ ఉమేష్, గస్తీ వాహనం డ్రైవర్ (పోలీసు) ఆమెను అడిగారు. ఇంటి నుంచి అలిగి వచ్చేశానని బాధితురాలు చెప్పడంతో.. ఇలా చేయకూడదని.. ఇంటి దగ్గర డ్రాప్ చేస్తామని చెప్పి వాహనంలో ఎక్కించుకున్నారు. 
 
అంతే దారిలో గస్తీ తిరుగుతున్న వాహనంలోనే పోలీస్ అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ విషయం బయటకు చెబితే చంపేస్తామని బెదిరించి ఆమెను ఇంటి సమీపంలో వదిలిపెట్టి వెళ్లిపోయారు. తరువాత బాధితురాలు ఇంటికి వెళ్లి జరిగిన విషయం తల్లికి చెప్పింది. దీంతో మహిళా పోలీస్ స్టేషన్‌లో బాధితురాలి కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేయడంతో  ఏఎస్ఐ ఉమేష్, గస్తీ వాహనం డ్రైవర్ మీద కేసు నమోదు చేశారు. 
 
ప్రాథమిక విచారణలో ఏఎస్ఐ ఉమేష్ ఒక్కడే బాధితురాలిపై అత్యాచారం చేశాడని గుర్తించామని తుమకూరు జిల్లా ఎస్పీ ఇషా పంత్ తెలిపారు. అత్యాచారం చెయ్యడానికి ఉపయోగించిన జీపు పోలీసు శాఖది కాదని, అది ప్రైవేట్ వాహనం అని పోలీసు అధికారులు సమర్థించుకున్నారు. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రోజూ ఉదయం నా మూత్రం నేనే తాగాను, అప్పుడే ఆ రోగం తగ్గింది: నటుడు పరేష్ రావల్ (video)

అక్టోబరు 31వ తేదీన పెళ్లి చేసుకుంటావా? ప్రియురాలికి సినీ దర్శకుడు ప్రపోజ్ (Video)

'ఎన్నో బాయ్‌ఫ్రెండ్' అంటూ కొందరు ప్రశ్నిస్తున్నారు : శృతిహాసన్

బెల్లంకొండ సాయి శ్రీనివాస్, అనుపమ పరమేశ్వరన్ ల కిష్కింధపురి ఫస్ట్ లుక్

Sridevi: ఆరోజునే 3డీలోనూ జగదేక వీరుడు అతిలోక సుందరి రీరిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డిజైన్ వాన్‌గార్డ్ 2025ను నిర్వహించిన వోక్సెన్ విశ్వవిద్యాలయం

'ది గ్రీన్ ఫ్లీ'ను ప్రారంభించిన ఇనార్బిట్ సైబరాబాద్

టమోటాలను తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

Annapurna yojana scheme: మహిళలకు వరం.. అన్నపూర్ణ యోజన పథకం.. షరతులు ఇవే

తాటి ముంజలు వేసవిలో ఎందుకు తినాలి

తర్వాతి కథనం
Show comments